20-06-2024
ఏజీగా దమ్మాలపాటి అనుభవం రాష్ట్రానికి అవసరం : ఎంపి కేశినేని శివనాథ్ చిన్ని
విజయవాడ : ఆంధ్రప్రదేశ్ అడ్వకేట్ జనరల్ గా పదవీ బాధ్యతలు చేపట్టిన దమ్మాలపాటి శ్రీనివాస్ కు విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని) పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే భవిష్యత్తులో మరెన్నో ఉన్నత పదవులను దమ్మాలపాటి అలంకరించాలని ఆకాంక్షించారు. ఎంపి కేశినేని శివనాథ్ గురువారం దమ్మాలపాటి శ్రీనివాస్ ను హైకోర్టులోని ఆయన ఛాంబర్ లో మర్యాద పూర్వకంగా కలిశారు.
ఈ సందర్బంగా కేశినేని శివనాథ్ మాట్లాడుతూ దమ్మాలపాటి కి న్యాయశాస్త్రం పై మంచి పట్టువుందని కొనియాడారు. అలాగే వైసీపీ ఆరాచక పాలనపై చేసిన న్యాయపోరాటంలో కీలకపాత్ర పోషించారని పేర్కొన్నారు. ఏజీగా రెండోసారి పదవీ బాధ్యతలు స్వీకరించిన దమ్మాలపాటి అనుభవం రాష్ట్రానికి ఎంతో అవసరం వుందని స్పష్టం చేశారు. దమ్మాలపాటి ఎన్టీఆర్ జిల్లా వాసి కావటం పట్ల గర్వంగా ఉందన్నారు.
2019లో దమ్మాలపాటిపై క్రిమినల్ కేసులు పెట్టి జగన్ ప్రభుత్వం ఇబ్బందులకు గురి చేసిన సంఘటనలు గుర్తు చేశారు.. మాజీ ముఖ్యమంత్రి జగన్ బాధితుల్లో ఏజీ దమ్మాలపాటి కూడా ఒకరని కేశినేని చిన్ని అన్నారు. గత ప్రభుత్వం రాజధాని ప్రాంతంలో అక్రమ భూములు ఉన్నాయని.. అక్రమ కేసులతో వేధించగా… ఆయనపై నమోదైన అక్రమ కేసుల నుంచి ఆయలనే వాదించుకొని బయటపడ్డాడని కొనియాడారు.. తనని అభినందించటానికి విచ్చేసిన ఎంపి కేశినేని శివనాథ్ కి ఏజీ దమ్మాలపాటి శ్రీనివాస్ కృతజ్ఞతలు తెలిపారు.