Home Political news ఎస్సీ. ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు విడుదల చేయాలి. దళిత బహుజన పార్టీ DBP డిమాండ్.ఆంధ్రప్రదేశ్...

ఎస్సీ. ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు విడుదల చేయాలి. దళిత బహుజన పార్టీ DBP డిమాండ్.ఆంధ్రప్రదేశ్ లో ఎస్సీ. ఎస్టీ సామాజిక వర్గాల అభివృద్ధి

3
0

 ఎస్సీ. ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు విడుదల చేయాలి. దళిత బహుజన పార్టీ DBP డిమాండ్.ఆంధ్రప్రదేశ్ లో ఎస్సీ. ఎస్టీ సామాజిక వర్గాల అభివృద్ధి

 కి ఉద్దెశించిన ప్రత్యేక బడ్జెట్ 22 శాతం నిధులు తక్షణమే విడుదల చేసి కార్యాచరణ ప్లాన్ రూపొందించాలని 

దళిత బహుజన పార్టీ DBP జాతీయ అధ్యక్షులు.

సుప్రీం కోర్ట్ న్యాయవాది వడ్లమూరి కృష్ణ స్వరూప్ చంద్రబాబు. పవన్ కళ్యాణ్. బిజెపి NDA ప్రభుత్వం ను డిమాండ్ చేసారు. నేడు విశాఖపట్నం లోని ప్రైవేట్ గెస్ట్ హౌస్ లో జరిగిన మీడియా సమావేశం లో మాట్లాడారు. గత వైస్సార్సీపీ సర్కార్ సబ్ ప్లాన్ నిధులను దారి మల్లించి దుర్వినియోగం చేసారని ఆరోపణలు చేశారు. ప్రస్తుతం ఈ నిధులు 2019 = 2024 వరకూ మొత్తం విడుదల. ఖర్చు పైన శ్వేతపత్రం విడుదల చేయాలని కోరారు.దళిత వాడల అభివృద్ధి కి. ఈ నిధులు వెచ్చించాలని. ఆర్ధిక.విద్యా. ఆరోగ్యం.వైద్య. సామాజిక.అభివృద్ధి. త్రాగు నీరు. నిరుద్యోగ నిర్ములన కోసం స్మాల్ స్కెల్ ప్రాజెక్ట్ లు ఏర్పాటు కోసం సబ్ ప్లాన్ నిధులను ఖర్చులు చేయాలన్నారు ఈ వర్గాల సామాజిక అభివృద్ధి కోసం 2014 సబ్ ప్లాన్ చట్టం ప్రకారం ఏడాదికి 12 వేల కోట్ల రూపాయలు కేటాయిస్తున్నా.. ఆచరణ లో సక్రమంగా ఖర్చు చేయకుండా నిధులను పక్కదారి పట్టించే చర్యలు చంద్రబాబు సర్కార్ అయినా మానుకోవాలన్నారు.బాబు కూటమి ప్రకటించిన ఎన్నికల వాగ్దానం సూపర్ 6 లో అంశాలు అమలు కోసం సబ్ ప్లాన్ నిధులను వాడుకోవద్దని విజ్ఞప్తి చేసారు. గత జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిన వివిధ కుల సంఘాల అన్ని కార్పొరేషన్ లను తక్షణమే రద్దు చేయాలని..మాల. మాదిగ. రెల్లి కుల కార్పొరేషన్ లను రద్దు చేసి ఎస్సీ కార్పొరేషన్ లో విలీనం చేసి మొత్తం ఎస్సీ కార్పొరేషన్ ను బలోపేతం చేయాలన్నారు.అదేవిధంగా ఎస్టీ కార్పొరేషన్. బీసీ. మైనారిటీ కార్పొరేషన్ లను బలోపేతం చేయాలని.. ఏబై వేల కోట్ల రూపాయలు నిధులు ఈ కార్పొరేషన్ లకు కేటాయించాలని జాతీయ ఎస్సి ఆర్ధిక సహకార కార్పొరేషన్ ను బలోపేతం చేసి తక్షణమే కేంద్ర నిధుల నుంచి నిరుద్యోగులకు రుణాలు మంజూరు చేయాలని కోరారు.

రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ డాక్టర్. అంబేద్కర్ ఆశయాలు కు వ్యతిరేకంగా ఉన్న ఎస్సీ వర్గీకరణ చేస్తామని సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటన ను తక్షణమే ఉపశOహరించికోవాలని. గత అసెంబ్లీ ఎస్సీ వర్గీకరణ కు అనుకూలంగా చేసిన తీర్మానం ను రద్దు చేయాలని రాష్ట్ర NDA కూటమి ని డిమాండ్ చేసారు. రాష్ట్రO లో ఎస్సీ. ఎస్టీ ల జరిగిన దాడులు. అత్యాచారాలు కేసులను వేగవంతం చేయాలని 

బాధితులకు నష్టపరిహారం చెల్లించడానికి నిధులు విడుదల చేయాలని. రాష్ట్ర ఎస్సీ. ఎస్టీ కేసుల విజిలెన్స్ మానేటరింగ్ కమిటీ ని సీఎం అధ్యక్షత న తక్షణమే ఏర్పాటు చేయాలని దీనికి సంబందించిన సమావేశం నిర్వహించాలని కోరారు. వివిధ కోర్ట్ ల్లో నామినేటెడ్ జీపీ. ఎజీపీ. పిపి. ఎజీపీ పోస్ట్ ల్లో ఎస్సీ. ఎస్టీ అడ్వకేట్ లతో భర్తీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నకు విజ్ఞప్తి చేసారు. ఈ సమావేశం లో పార్టీ విశాఖపట్నం జిల్లా శాఖ అధ్యక్షులు. న్యాయవాది బాన్న రమేష్. పార్టీ లీగల్ సెల్ విశాఖ సిటీ చైర్మన్ రాయపాటి సామ్యూల్ జాన్సన్ ధర్మరాజు తదితరులు పాల్గొన్నారు. జై భీమ్ లు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here