వ్యవసాయ శాఖ ఎరువుల అంతిమ నిల్వలను ఈ- పోస్ మెషిన్ లలో తాజాగా ఎప్పటికప్పుడు సరిచూసుకోండి డిల్లీ రావు ఐఏఎస్ వ్యవసాయ సంచాలకులు #)రాష్ట్ర సంవత్సర సరాసరి ఎరువుల వినియోగం 16 లక్షల టన్నులలో కనీసం 4 లక్షల టన్నుల ఎరువుల వినియోగంను(25 శాతం మేర) తగ్గించాలి అని ఆదేశించిన గౌరవ ముఖ్యమంత్రి #) తగ్గించిన ఎరువుల సబ్సిడీ మొత్తం విలువలో 50 శాతం ను కేంద్ర పథకం *పీఎం ప్రనామ్* ద్వారా పొందే అవకాశం – వాటి ద్వారా మౌలిక సదుపాయాలు కల్పించే అవకాశం .#)10 జూన్ 2025 న రాష్ట్ర వ్యవసాయ సంచాలకులు కార్యాలయంలో *ఎరువుల సరఫరా – పంపిణీ పై* జరిగిన విస్తృత సమావేశం – చర్చ జరిగింది#)పాల్గొన్న ఎరువుల కంపెనీల రాష్ట్ర మార్కెటింగ్ మేనేజర్లు , మార్క్ ఫెడ్ అధికారులు , హోల్ సేల్ మరియు రిటైల్ వ్యాపారుల సంఘ ప్రతినిధులు#) నానో సాంకేతిక ఎరువుల వినియోగం పెంచాలి #)రైతులతో ప్రత్యక్ష వ్యాపార సంబంధం ఉన్న రిటైల్ వ్యాపారులను అత్యంత పరిగణనలోనికి తీసుకొని కంపెనీలు ,హోల్ సేల్ వ్యాపారులు వారి కొనుగోలుపై కొన్ని రకాల ఉత్పత్తులను లింక్ పెడితే కటిన చర్యలు తీసుకుంటాం — —– —— _— —- ఈ సమావేశం లో డిల్లీ రావు మాట్లాడుతూ క్షేత్ర స్థాయిలో వ్యాపారులు ఎరువుల అమ్మకాలలో *ఈ పోస్ మెషిన్* లలో *నిజ సమయ స్టాక్ రసీదు* విధానం పాటించాలని ,తద్వారా రాష్ట్రములో అందుబాటులో ఉన్న ఎరువులను బేరీజు వేసుకుని కావలసిన ఎరువులను కేంద్ర ప్రభుత్వమును అడగటానికి అవకాశం ఉంటుందని ,అలాకాకుండా ఎప్పటికప్పుడు సరిచూసుకో కుండా నిల్వలు ఎక్కువగా ఉండటం ద్వారా ఎరువుల కేటాయింపులలో కోతలు పెడుతున్నారని చెప్పారు . ఖరీఫ్ సీజన్ వరి నాట్లు మరికొద్ది రోజులలో మొదలు అయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో తయారీ దారులు ఎక్కువ మొత్తంలో డి ఏ పి ఎరువులను అందించాలని ,తద్వారా యూరియా వినియోగం కొంతమేర తగ్గే అవకాశం ఉందని తెలియచేసారు . నానో ఎరువుల వినియోగం పై మాట్లాడుతూ వరిపంట పిలకలు తొడిగే దశలో ,కంకులు పాలు పోసుకునే దశలో నానో యూరియా, డి ఏ పి లను రసాయనిక ఎరువులకు ముఖ్యముగా యూరియా కు బదులుగా వాడాలని చెప్పరు .రాష్ట్రములో ఈ విధానం పై నమ్మకం కల్పించే దిశగా 268 క్షేత్ర స్థాయి ప్రదేశాల్లో నానో ఎరువుల వినియోగం,దిగుబడుల ప్రభావం పై ప్రదర్శన క్షేత్రములను ఖరీఫ్ సీజన్లో ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు .నానో ఎరువుల వినియోగం పై రైతులకు ఎరువుల సరఫరా దారులు ,వ్యాపారులు మరింత ప్రచారం చేయాలని కోరారు. ఎరువుల అమ్మకం ధరల విషయంలో ఎటువంటి అక్రమాలకు పాల్పడితే కటిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని,లైసెన్సులు రద్దు చేస్తామని తెలిపారు.రిటైల్ వ్యాపారుల మాట్లాడుతూ కంపెనీలు ఎరువులను ఎఫ్ ఓ యల్ విధానము ద్వారా సరుకును రిటైల్ కేంద్రాలకు సరఫరా చేయాలని కోరారు .సంయుక్త సంచాలకులు కృపదాస్ రైలు రేకుల ద్వారా ఎరువుల సరఫరా కదలికను తెలుసుకునే ట్రాకింగ్ చేసే విధానాన్ని *అజైల్ యాప్* ను వివరించారు ఈ కార్యక్రమంలో అడిషనల్ డైరెక్టర్ వి శ్రీధర్ , డి డి వెంకటేశ్వర్ రావు ,ఊర్మిళ ,మార్క్ ఫెడ్ జనరల్ మేనేజర్ శ్రీనివాస్ రావు పాల్గొన్నారు .ఎరువుల వ్యాపారుల సంఘం నుండి నాగిరెడ్డి ,శివాజీ ,విజయకుమార్ ,లక్ష్మణ రావు పాల్గొన్నారు .