ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ను భారీ మెజారిటీతో గెలిపించుకోవాలి : ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు
గన్నవరం ఫిబ్రవరి 14 : ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ను అత్యధిక ఓట్ల మెజార్టీతో గెలిపించుకోవాలని ప్రభుత్వ విప్, గన్నవరం శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావ్ పిలుపునిచ్చారు. ఆలపాటి రాజేంద్రప్రసాద్ గెలుపు గురించి దేశంలో, రాష్ట్రంలో చర్చించుకునే స్థాయిలో భారీ మెజారీటీ సాధించాలని కోరారు. శుక్రవారం గన్నవరం పట్టణంలోని స్రవంతి పాఠశాలలో కృష్ణ, గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు తో కలిసి ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్రప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏపీ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్(డెమొక్రటిక్) ఆధ్వర్యంలో ప్రైవేట్ ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ప్రతికూల పరిస్థితుల్లో కూడా గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో టిడిపి అభ్యర్థిని గెలిపించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. గన్నవరం నియోజకవర్గ ఓటర్లు విజ్ఞులని పెద్దల సభకు ఆలపాటి రాజేంద్రప్రసాద్ లాంటి వ్యక్తులను కచ్చితంగా పంపుతారని ధీమా వ్యక్తం చేశారు. ఉపాధ్యాయుల కన్నా గొప్పవారు ఎవరు లేరని ఆలపాటి గెలుపు ద్వారా ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కారం అవుతాయని పేర్కొన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ పోటీలో లేనప్పటికి ఈ ఎన్నికలను తేలికగా తీసుకోకూడదన్నారు.అధికారంలోకి వచ్చిన ఏడు నెలల కాలంలో ఈ ఎన్నికలు జరుగుతున్నాయని, కూటమి పాలనకు ఈ ఎన్నికలు ఒక పరీక్ష అని తెలిపారు. రాష్ట్రానికే తలమానికంగా మల్లవల్లి పారిశ్రామిక కారిడార్ అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. గన్నవరం అభివృద్ధి అజెండాగా తాను పనిచేస్తున్నానని స్పష్టం చేశారు. నిరుద్యోగులకు రానున్న కాలంలో పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయిని స్పష్టం చేశారు. గన్నవరం పట్టణంలో ఎన్టీఆర్ , మహాత్మా గాంధీ నూతన విగ్రహాలను ఏర్పాటు చేస్తామని అలాగే ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేసి సుందరీకరణ పనులను చేపట్టేలా చర్యలు తీసుకుంటామని వివరించారు. గన్నవరం అనగానే గన్నవరం అభివృద్ధి తెలియచెప్పేలా హెచ్ సి ఎల్ , ఎయిర్పోర్ట్ లాంటి అభివృద్ధిని ప్రజలకు చూపించాలని మీడియా వారిని ఈ సందర్భంగా కోరారు. ఆలపాటి రాజేంద్రప్రసాద్కు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి దేశంలో రాష్ట్రంలో చర్చించుకునే స్థాయిలో భారీ మెజారీటీ సాధించాలని కోరారు. కార్యక్రమం లో నియోజకవర్గ ఎమ్మెల్సీ ఓట్ల పరిశీలకులు వీర బాబు , టీడీపీ పరిశీలకులు వడ్రాణం హరిబాబు, టిడిపి , జనసేన , బిజెపి నాయకులు ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు