ఎమ్మెల్యే సుజనా చౌదరి ను పరామర్శించిన మంత్రి కొల్లు రవీంద్ర
ఇటీవల జరిగిన శస్త్ర చికిత్స అనంతరం హైదరాబాదులోని తమ నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్న ఎమ్మెల్యే సుజనా చౌదరి ను ఆదివారం రాష్ట్ర గనులు
భూగర్భ వనరుల ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పరామర్శించారు.
లండన్ పర్యటనలో గాయపడిన సుజనా చౌదరి కుడి భుజానికి గాయం అవ్వడంతో శస్త్ర చికిత్స చేశారు. ప్రస్తుతం ఆయన హైదరాబాదులోని తమ నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. విషయం తెలుసుకున్న మంత్రి కొల్లు రవీంద్ర ఆదివారం హైదరాబాద్ వెళ్లి ఎమ్మెల్యేను పలకరించారు. ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. సుజనా చౌదరి త్వరగా కోలుకోవాలని మంత్రి కొల్లు రవీంద్ర ఆకాంక్షించారు..