ఎమ్మెల్యే సుజనా చౌదరి క్షేమాన్ని కోరుతూ మృత్యుంజయ మరియు గాయత్రి హోమం విజయవాడ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు యలమంచిలి సత్యనారాయణ (సుజనా చౌదరి) ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుతూ గాయత్రి ప్రజ్ఞా పరివార్, బాయన కనకదుర్గాంబ ఆధ్యాత్మిక మందిరము వారి ఆధ్వర్యంలో ఆదివారం భవానిపురంలోని ఎన్డీఏ కార్యాలయంలో “మృత్యుంజయ” మరియు “గాయత్రి హోమం” వైభవంగా నిర్వహించారు.ఎమ్మెల్యే సుజనా చౌదరి క్షేమంగా ఉండాలని సర్వేశ్వరుడిని ప్రార్థించారు.లండన్ పర్యటనలో ఉన్న సుజనా చౌదరి ఈనెల మొదటి వారంలో ప్రమాదానికి గురై హైదరాబాద్ లో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే!అప్పటినుంచి సుజనా ఆరోగ్యం కోసం ఎన్డీయే కూటమి నేతలు , కార్యకర్తలు,అభిమానులు, అర్చనలు, పూజలు, మసీద్ లు, చర్చిలలో ప్రత్యేక ప్రార్థనలుచేస్తూ తమ ఎమ్మెల్యే క్షేమంగా ఉండాలని వారి ఇష్ట దైవాన్ని ప్రార్థిస్తున్నారు.. భవానిపురం, ఎన్డీఏ కార్యాలయంలో “గాయత్రీ ప్రజ్ఞా పరివార్” బాయన కనకదుర్గాంబ ఆధ్యాత్మిక మందిరము వారి ఆధ్వర్యంలో యజ్ఞ నిర్వాహకులు ఏ.వీ.యన్.యస్ కుమార్, బాయన హేరంభ కుమార్ , జోగి రాజ్ పురోహిత్ , బోలిశెట్టి శ్రీనివాస్,దుర్గ వేద పండితులతో నియమ నిష్ఠలతో “మహా మృత్యుంజయ మరియు గాయత్రి హోమం” నిర్వహించారు.సుజనా చౌదరి కి ఎటువంటి కీడు జరగకుండా ,అనారోగ్య సమస్యలన్నీ తొలగి, సంపూర్ణ ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని ఆ సర్వేశ్వరుడిని ప్రార్థించారు. ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ పర్యవేక్షించిన ఈ పవిత్ర హోమంలో ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్, ఎన్డీఏ కూటమి నేతలు, బుల్లా విజయ్ కుమార్ ,యేదుపాటి రామయ్య , బెవర మురళి కృష్ణ, మంగళపురి మహేష్, అవ్వారు బుల్లబ్బాయి, బెవర శ్రీనివాస్, ఉమాకాంత్ ,దొడ్ల రాజా,సప్పా శ్రీనివాస్, మైనంపాటి రమేష్, పచ్చవ మల్లికార్జున,బ్రహ్మారెడ్డి, సమ్మెట రాజా నాయుడు, కొల్లి దుర్గారావు,ఎన్డీఏ కార్యాలయ సిబ్బంది కసుకుర్తి రాజేష్ ,చింతా సృజన్ (బాబీ) మంతెన తరుణ్ , తదితరులు పాల్గొన్నారు
