అల్లీపురం పి.హెచ్.సీకి మహర్దశ
ఎమ్మెల్యేలు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో అల్లీపురం శ్రీ సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అవసరమైన వసతుల కల్పనకు అడుగులు
రూ.1.35 కోట్లతో అభివృద్ధి పనులు చేయాలని మంత్రి సత్యకుమార్ యాదవ్ కు ప్రతిపాదన
ప్రహరీ, అదనపు భవనాలు, మీటింగ్ హాలు, వాచ్ మెన్ గదుల నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని వినతి
ఎంపీ నిధుల నుంచి రూ.30 లక్షలు కేటాయించేందుకు అంగీకరించిన రాజ్యసభ సభ్యులు బీద మస్తాన్ రావు..ఎంపీని అభినందించిన మంత్రి
మిగిలిన నిధుల కేటాయింపును కూడా పరిశీలిస్తామని హామీ ఇఛ్చిన మంత్రి సత్యకుమార్ యాదవ్
సత్యకుమార్ యాదవ్ కామెంట్స్
రాష్ట్రంలో పటిష్టమైన ఆరోగ్య వ్యవస్థను రూపొందించేందుకు సీఎం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కృషి చేస్తున్నాం
వ్యవస్థలన్నింటిని పటిష్టపరచడంతో పాటు వైద్య శాఖలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టాం
సెకండరీ హెల్త్ విభాగంలో ఇన్ సర్వీస్ కోటా నుంచి వచ్చే వారు 300 మంది ఉండగా, కొత్తగా 300 మంది సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులు భర్తీ చేస్తున్నాం
స్పెషలిస్టుల కొరత లేకుండా అవరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నాం..టీచింగ్ ఆస్పత్రుల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ల రిక్రూట్ మెంటుపైనా ప్రత్యేక దృష్టి పెట్టాం
ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లతో పాటు టీచింగ్ స్టాప్, ఎఫ్ఎన్ఓ, ఎంఎన్ఓ పోస్టులు, టీచింగ్, నర్సింగ్ పోస్టుల కొరత తీవ్రంగా ఉంది
అన్ని స్థాయిల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసి పటిష్టమైన ఆరోగ్య వ్యవస్థను రూపకల్పన చేసే ప్రయత్నంలో ఉన్నాం
*రూ.30 లక్షలు నిధులు కేటాయించేందుకు అంగీకరించిన రాజ్యసభ సభ్యులు బీద మస్తాన్ రావుకు ధన్యవాదములు తెలియజేసిన సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి
కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ బీద మస్తాన్ రావు, ఏపీ ఆక్వా అథారిటీ చైర్మన్ ఆనం వెంకటరమణారెడ్డి, డీసీఎంఎస్ చైర్మన్ గంగోటి నాగేశ్వరరావు, ఆర్టీసీ నెల్లూరు రీజినల్ చైర్మన్ సన్నపురెడ్డి సురేష్ రెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు వంశీధర్ రెడ్డి, సురేంద్ర రెడ్డి, ఏపీ సివిల్ సప్లయీస్ కార్పొరేషన్ డైరెక్టర్ వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి, డీఎంహెచ్ఓ డాక్టర్ సుజాత తదితరులు*