05-11-2024
ఎమ్మెల్యేలు, అధికారుల సహకారంతో పార్లమెంట్ నియోజకవర్గాన్ని అభివృద్ది పథంలో ముందు నిలబెడతాను : దిశ ఛైర్మన్, ఎంపి కేశినేని శివనాథ్
కలెక్టర్ కార్యాలయంలో జరిగిన దిశ సమీక్షా సమావేశం
దిశ ఛైర్మన్ గా ఈ సమావేశాన్ని నిర్వహించిన ఎంపి కేశినేని శివనాథ్
ఈ సమావేశంలో సెంట్రల్ స్కీమ్స్ అమలు పై చర్చ
సోర్స్ ఆఫ్ వాటర్ నుంచి ట్యాప్ కనెక్షన్ కు డిపిఆర్ లు సిద్దం
జల్ జీవన్ మిషన్ వంద శాతం పూర్తి చేసేందుకు కృషి
తిరువూరులో ఎన్.ఐ.ఆర్.డి ద్వారా క్లస్టర్ ఏర్పాటు
అంగన్ వాడీ కేంద్రాల్లో హైజినిక్ కిచెన్ ఏర్పాటు
విజయవాడ : ఎన్టీఆర్ జిల్లాలో సెంట్రల్ స్కీమ్స్ అమలు వంద శాతం వుండేలా కృషి చేస్తాను. అలాగే రాబోయే రెండు సంవత్సరాల్లో అమరావతి రాజధాని ప్రాంతంలో వున్న విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఏడు నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, జిల్లా అధికారుల సహకారంతో అన్ని విధాలుగా ముందుకి తీసుకువెళతానని దిశ చైర్మన్, ఎంపి కేశినేని శివనాథ్ తెలిపారు.
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని పింగళి వెంకయ్య మీటింగ్ హాల్ నందు మంగళవారం దిశ చైర్మన్, ఎంపి కేశినేని శివనాథ్ ఆధ్వర్యంలో జిల్లా అభివృద్ది సమన్వయ పర్యవేక్షణా కమిటి (దిశ) సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఇన్చార్జ్ కలెక్టర్ నిధిమీనా, ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్, కొలికపూడి శ్రీనివాసరావు, శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య), ఉమ్మడి కృష్ణా జిల్లా జడ్.పి సి.ఈ.వో కె.కన్నమ నాయుడు, ఎన్.టి.ఆర్. జిల్లా డి.ఆర్.వో ఎమ్.లక్ష్మీ నరసింహంలతోపాటు జిల్లా అధికారులు, దిశ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
ఈ సమీక్షా సమావేశం అనంతరం దిశ ఛైర్మన్, ఎంపి కేశినేని శివనాథ్ సమావేశంలో జరిగిన విషయాలను మీడియాకి వెల్లడించారు. మీడియాతో ఎంపి కేశినేని శివనాథ్ మాట్లాడుతూ దిశ కమిటీ సమీక్షా సమావేశంలో చర్చించిన పలు అంశాలకు సంబంధించి అధికారులు పూర్తి సమాచారంతో రావటం చాలా ఆనందం కలిగిందన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు ఎన్టీఆర్ జిల్లాలో ఏ విధంగా అమలు అవుతున్నాయో పర్యవేక్షించి, అమలు కాని పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించటమే దిశ కమిటీ ముఖ్యోద్దేశ్యం అన్నారు. ఎన్టీఆర్ జిల్లాలో అమలు అవుతున్న సెంట్రల్ స్కీమ్స్ పై చర్చించటం జరిగిందన్నారు.
గత ప్రభుత్వంలో జల్ జీవన్ మిషన్ అమలు విషయంలో ఎన్టీఆర్ జిల్లా ఐదో స్థానంలో వుందన్నారు. రాబోయే ఏడాదిలో ఎన్టీఆర్ జిల్లాలో జల్ జీవన్ మిషన్ పథకాన్నివందశాతం పూర్తి చేసే విధంగా అధికారులతో కలిసి కృషి చేసే అంశం చర్చించినట్లు తెలిపారు. అలాగే జల్ జీవన్ మిషన్ వినియోగించి సోర్స్ ఆఫ్ వాటర్ నుంచి టాప్ కనెక్షన్ ద్వారా ప్రతి ఇంటికి సురక్షిత మంచినీరు అందించేందుకు డిపిఆర్ లు రెడీ చేయిస్తున్నట్లు తెలిపారు..
ఇక ఎన్టీఆర్ జిల్లాలో వున్న అన్ని పి.హెచ్.సి ల్లో మరిన్నీ వైద్య సదుపాయాలు కల్పించి అత్యాధునికంగా తీర్చిదిద్దేందుకు కృషి చేసే అంశంపై మాట్లాడుకున్నట్లు చెప్పారు. అలాగే జిజిహెచ్ అభివృద్ది కోసం గత పార్లమెంట్ సమావేశాల్లో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జెపి నడ్డాని 130 కోట్ల రూపాయాలు మంజూరు చేయాల్సిందిగా అభ్యర్ధన చేసే విషయం గుర్తు చేశారు. ఆ విషయం పై కూడా అధికారులతో చర్చించటంతోపాటు జిల్లాలో వైద్య సదుపాయాలను మెరుగుపర్చే విషయం చర్చించటం జరిగిందన్నారు.
ఇక జిల్లాలో 857 అంగన్ వాడీ కేంద్రాలకు సొంత భవనాలకు కావాల్సి వుంది. అలాగే కొన్ని అంగన్ వాడీ కేంద్రాలు సొంత భవనాలు వున్నా వాటికి కాంపౌండ్ వాల్ లేదు. ఈ సమస్యలు పరిష్కరించటంతో పాటు జిల్లాలోని అంగన్ వాడీ కేంద్రాల్లో హైజినిక్ కిచెన్ ఏర్పాటు చేసే విషయం పై చర్చించటం జరిగిందని తెలిపారు.
అలాగే ఎడ్యుకేషన్ విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, విద్య శాఖ మంత్రి నారా లోకేష్ ప్రతి స్కూల్ లో గ్రౌండ్ వుండాలని కోరుకుంటున్నారు. అదే విధంగా ప్రతి స్కూల్ లో గ్రౌండ్ నిర్మించే విషయం పై చర్చ జరిగినట్లు పేర్కొన్నారు. ఎడ్యుకేషన్ కి సంబంధించి డిటైయిల్డ్ రివ్యూ త్వరలో చేయబోతున్నట్లు ప్రకటించారు.
ఈ అంశాలతో పాటు ప్రధాన మంత్రి సడక్ యోజన్ పథకం కింద గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల కనెక్టివిటీ పెంచే విషయం పై చర్చ జరిగిందని తెలిపారు. అదే విధంగా అగ్రికల్చరల్ డిపార్టమెంట్ కి సెంట్రల్ స్కీమ్స్ ద్వారా సబ్సిడీ వచ్చే పథకాలపై చర్చించినట్లు తెలిపారు. దేశంలోనే ప్రకృతి వ్యవసాయంలో ఆంధ్రప్రదేశ్ ముందు వుంది. వ్యవసాయం రంగంలో కూడా ఎన్టీఆర్ జిల్లా ముందుండే విధంగా కృషి చేస్తామన్నారు.
అగ్రికల్చర్ తోపాటు రూరల్ డెవలప్ మెంట్ కోసం ఎంతో మందికి ఉపాది కల్పించే విధంగా ఎన్నో సెంట్రల్ స్కీమ్స్ వున్నాయి.. నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్ మెంట్ సెంటర్ (ఎన్.ఐ.ఆర్.డి) హైదరాబాద్ లో 256 ఎకరాల్లో వుంది. వీరు ట్రైనింగ్ ఇవ్వటంతో పాటు, సర్టిఫికెట్ అందించి ఉద్యోగం అవకాశాలు కల్పిస్తారు. వాళ్ల ద్వారా అగ్రికల్చర్,ఫుడ్ ప్రోసిసెంగ్ యూనిట్ అభివృద్దికి తిరూవురు లో నాలుగైదు రోజుల్లో ఒక క్లస్టర్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఎన్.ఐ.ఆర్.డి సందర్శించి ఆ సంస్థ డైరెక్టర్ తో మాట్లాడటం జరిగిందన్నారు. హైదరాబాద్ లోని ఎన్.ఐ.ఆర్.డి సంస్థ ద్వారా రైతులకి , యువతకి ఉపాధి కల్పించేందుకు ఎన్నో స్కీమ్స్ వున్నాయి. అక్కడ యువతకి, రైతులకి శిక్షణ ఇప్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.
రాష్ట్రంలో 20 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించటమే లక్ష్యంగా సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారు. . ఒక కుటుంబానికి ఒక ఎంటర్ ప్రెన్యూర్ అనే నినాదంతో ముఖ్యమంత్రి చంద్రబాబు ముందుకి వెళుతున్నారు. .అందుకే ఎన్టీఆర్ జిల్లాలో గ్రామీణ ప్రాంతంలో ఎక్కువ మందికి ఏ విధంగా ఉపాధి కల్పించవచ్చు అనే విషయం, ఏ రంగం అభివృద్ది కి కృషి చేయాలనే అంశం పై కూడా చర్చించటం జరిగిందన్నారు. ఎమ్.ఎస్.ఎమ్.ఈ స్కీమ్స్.క్లస్టర్స్ లోన్స్ కానీ ఏ విధమైన క్లస్టర్ ఏర్పాటు చేస్తే ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయనే అంశం పై కూడా చర్చించిట్లు చెప్పారు.
అలాగే ఎన్టీఆర్ జిల్లాలో స్వచ్ఛ్ భారత్ లో భాగంగా 20 వేల టాయిలెట్స్ కట్టాలి. రాబోయే మార్చి ఏప్రిల్ కల్లా ఈ టాయిలెట్స్ నిర్మాణం పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చే అంశం చర్చించటం జరిగిందని తెలిపారు.ఈ సమీక్షా సమావేశంలో వో.ఎస్.డి ఎ.వెంకటరత్నం, దిశ కమిటీ సభ్యులు, సీపీవో వై.శ్రీలత, డీఆర్డీఏ పీడీ కె.శ్రీనివాసరావు, డీఎంహెచ్వో డా. ఎం.సుహాసిని, డ్వామా పీడీ ఎ.రాము, ఐసీడీఎస్ పీడీ జె.ఉమాదేవి, డీఈవో యూవీ సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.