ఎన్.టి.ఆర్. జిల్లా పోలీస్ కమిషనర్ వారి కార్యాలయము, విజయవాడ.* *తేదీ.14.02.2025
ఎన్.టి.ఆర్. ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న థమన్ మ్యూజికల్ నైట్ కార్యక్రమ బందోబస్తు ఏర్పాట్లు పరిశీలించిన నగర పోలీస్ కమీషనర్ ఎస్. వి. రాజ శేఖర బాబు ఐ. పి ఎస్.
ఎన్. టి. ఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రేపు ది.15.02.2025 తేదిన ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహిస్తున్న థమన్ మ్యూజికల్ నైట్ కార్యక్రమం పురస్కరించుకొని ఈ రోజు ది.14.02.2025 తేదిన *పోలీస్ కమీషనర్ ఎస్.వి.రాజ శేఖర బాబు ఐ.పి.ఎస్* ఇతర పోలీస్ అధికారులతో కలిసి స్టేడియంలో జరుగబోవు థమన్ మ్యూజికల్ నైట్ కార్యక్రమం సందర్బంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు మరియు ఇతర ప్రముఖులు ఈ కార్యక్రమానికి వస్తున్న నేపథ్యంలో
స్టేడియం మరియు స్టేడియం పరిసర ప్రాంతాలలో ఏర్పాటు చేసిన కట్టు దిట్టమైన భద్రత, పటిష్ట బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించి భద్రతా పరంగా ఎటువంటి చిన్న లోపాలు లేకుండా సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకొని తగిన భద్రత చర్యలు చేపట్టాలని అధికారులుకు ఆదేశాలు జారి చేసారు. ట్రాఫిక్ పరంగా సామాన్య ప్రజలు ఎక్కడా ఇబ్బందులు పడకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో పోలీస్ కమీషనర్ ఎస్.వి.రాజ శేఖర బాబు ఐ.పి.ఎస్. డి. సి. పి. లు. గౌతమీ షాలి ఐ. పి. ఎస్, డా. తిరుమలేశ్వర రెడ్డి ఐ. పి.ఎస్ కె. ఎం. మహేశ్వర రాజు ఐ. పి.ఎస్ కె. జి. వి. సరిత ఐ. పి.ఎస్ కృష్ణమూర్తి నాయుడు ఏ.డి.సి.పి.లు,ఏ.సి.పి.లు, ఇన్స్పెక్టర్లు, ఎస్. ఐ. లు మరియు సిబ్బంది పాల్గొన్నారు.