14-3-2025
ఎన్నికల ముందు ఇచ్చినటువంటి మాట ప్రకారం సమస్యలు లేని నియోజకవర్గంగా సెంట్రల్ నియోజకవర్గం తీర్చిదిద్దడమే తన లక్ష్యం – MLA బొండా ఉమ
ప్రజలకు ఎటువంటి సమస్య లేకుండా ఉండేందుకు తమ ఎన్డీఏ ప్రభుత్వం కృషి చేస్తుంధి – MLA బొండా ఉమ
ధి:14-3-2025 ఈరోజు అనగా శుక్రవారం ఉదయం 9:30″గం లకు ” సెంట్రల్ నియోజకవర్గంలోని 63 & 64 డివిజన్ రాజీవ్ నగర్ కొత్త రోడ్డు మరియు కండ్రిక మెయిన్ రోడ్డు, మెయిన్ డ్రైన్ R.C.మరియు కల్వర్టుల నిర్మాణం పనులు ప్రారంభించడం జరిగింది
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు మరియు తెలుగుదేశం పార్టీ యువ నాయకులు ప్రముఖ న్యాయవాది బొండా రవితేజ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించి శంకుస్థాపన పనులు ప్రారంభించి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు
సందర్భంగా బొండా ఉమా మాట్లాడుతూ:- తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 9 నెలల కాలంలో ఎన్నికైన తర్వాత అభివృద్ధి పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయి, గత వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో నిర్లక్ష్యానికి గురైనటువంటి నియోజకవర్గా అభివృద్ధి, నేడు అభివృద్ధిలో ముందుందని
నియోజకవర్గంలో గత వైసీపీ ప్రభుత్వం లొ నిర్లక్ష్యం కాబడిన పనులు ఈ తొమ్మిది నెలల కాలంలో దాదాపు 140 కోట్ల రూపాయల పనులు పూర్తిచేసం అని, 2014 నుండి 2019 వరకు తాను శాసనసభ్యులుగా ఉన్న సమయంలో L&T తో డ్రైన్స్ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన ₹500 కోట్లు నిధులు అందులో ₹150 కోట్లు కేవలం L&T డ్రైన్స్ కోసం నియోజకవర్గం ఆనాడు కేటాయించామని, నియోజకవర్గంలో ఆనాడే లేక డ్రైన్స్ పనులు శంకుస్థాపన చేసే మొదలుపెట్టామని
తర్వాత 2019లో అధికారంలోకి వెళ్లినటువంటి వైసీపీ ప్రభుత్వం పనులు పూర్తి చేయకుండా వదిలేసింది అని, తిరిగి 2024లో అధికారంలోకి వచ్చినటువంటి తెలుగుదేశం ప్రభుత్వం అధికారులతో సమీక్షల నిర్వహించి, కొత్త టెండర్లు వేపించి నియోజకవర్గంలో ఆగిపోయినటువంటి పనులను మళ్లీ పునర్ప్రారం నుంచి శంకుస్థాపనలు చేస్తున్నామని, నియోజకవర్గానికి సమస్యగా మారినటువంటి డ్రైనేజీ సమస్య త్వరలోనే తీరబోతుందని పేద ప్రజలు అధికంగా నివసించేటువంటి 63 మరియు 64 డివిజన్ లలొ డ్రైనేజి పనులు ప్రారంభించడం వల్ల రేపు వర్షాలు వచ్చిన వరదలు వచ్చిన ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈరోజు ₹14 కోట్ల రూపాయలతో బ్యాలెన్స్ ఉన్న పనులకు టెండర్ల ద్వారా తెలియడం జరిగిందని
మెయిన్ ట్రైన్ రాజీవ్ నగర్ కట్టవద్దన ఉన్నదని ఈ ఒక్కటే ₹7 కోట్ల రూపాయలతో శంకుస్థాపన చేయడం జరిగిందని, నియోజకవర్గంలో ప్రతి డివిజన్లో ఉన్నటువంటి సమస్యలు మీద తనకు పూర్తి అవగాహన ఉన్నదని, పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా రాష్ట్ర మంత్రివర్యులు నారాయణ కి, మున్సిపల్ కమిషనర్ కి, CE కి, SE దృష్టిలో ఇప్పటికే ఉంచడం జరిగిందని ఎప్పటికప్పుడు మంత్రులతో అధికారులతో సమావేశాలు నిర్వహించి నియోజకవర్గ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్నామని, 23 వ తేదీన సెంట్రల్ నియోజకవర్గంలో ₹22 కోట్ల రూపాయలతో చేయనున్న అభివృద్ధి పనులు గురించి ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు కి తెలియజేసి నిధులు కేటాయించి ఆ పనులను కూడా త్వరగా పూర్తిగా చేస్తామని బొండా ఉమ తెలియజేశారు
ఈ కార్యక్రమంలో:- కార్పొరేటర్ మోదుగల తిరుపతమ్మ, Ex కార్పొరేటర్ పైడి తులసి, బత్తుల కొండ, లబ్బా వైకుంఠం, కోలా శ్రీను, మోతుకూరి కాసిం, పలగాని శివ, పలగాని భాగ్యలక్ష్మి, కాకొల్లు రవి, కాంట్రాక్టర్ శివ, అంజి బాబు తదితరులు పాల్గొన్నారు