Home Andhra Pradesh ఎన్డీయే కూట‌మి ప్ర‌భుత్వంతోనే అభివృద్ది సాధ్యం : ఎంపి కేశినేని శివ‌నాథ్ (చిన్ని) 58వ డివిజ‌న్...

ఎన్డీయే కూట‌మి ప్ర‌భుత్వంతోనే అభివృద్ది సాధ్యం : ఎంపి కేశినేని శివ‌నాథ్ (చిన్ని) 58వ డివిజ‌న్ లో ఎమ్మెల్యే బొండా ఉమామ‌హేశ్వ‌ర‌రావు తో క‌లిసి బీటీ రోడ్ల‌ల‌కు శంకుస్థాప‌న‌

7
0

03-06-2025 ఎన్డీయే కూట‌మి ప్ర‌భుత్వంతోనే అభివృద్ది సాధ్యం : ఎంపి కేశినేని శివ‌నాథ్ (చిన్ని) 58వ డివిజ‌న్ లో ఎమ్మెల్యే బొండా ఉమామ‌హేశ్వ‌ర‌రావు తో క‌లిసి బీటీ రోడ్ల‌ల‌కు శంకుస్థాప‌న‌ విజ‌య‌వాడ : ఎన్డీయే కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయ‌యుడు నాయ‌క‌త్వంలో రాష్ట్రంలో ర‌హ‌దారులు అభివృద్దికి నోచుకుంటున్నాయ‌ని ఎంపి కేశినేని శివ‌నాథ్ అన్నారు. సెంట్రల్ నియోజకవర్గం 58వ డివిజన్ లో ప‌లు రోడ్ల‌కు ఎమ్మెల్యే బొండా ఉమామ‌హేశ్వ‌ర‌రావు తో క‌లిసి శంకుస్థాప‌న చేశారు. తోటవారి వీధి 9వ లైన్ లో భరతమాత కాలనీ మెయిన్ రోడ్డు, నందమూరి నగర్ పీనల్ చర్చి రోడ్డు, ఇందిరా నాయక్ నగర్ నుండి రాజరాజేశ్వరి పేటకు కోటి డ‌బ్బై రెండు లక్షల నిధులతో బీటీ రోడ్లు మంజూరు కావ‌టం జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా ఎంపి కేశినేని శివ‌నాథ్, ఎమ్మెల్యే బొండా ఉమామ‌హేశ్వ‌ర‌రావుతో క‌లిసి భూమి పూజ చేసి కొబ్బరికాయలు కొట్టారు.ఈ సంద‌ర్బంగా ఎంపి కేశినేని శివ‌నాథ్ మాట్లాడుతూ సీఎం చంద్ర‌బాబు నాయ‌క‌త్వంలో రాష్ట్రం సుభిక్షంగా వుండ‌టంతోపాటు అభివృద్ది దిశ‌గా ప‌య‌నిస్తుంద‌న్నారు.అభివృద్ది తో పాటు సంక్షేమ ప‌థ‌కాలు ప్ర‌జ‌లంద‌రికీ అందేలా చూస్తున్నార‌ని కొనియాడారు. దేశంలోనే రాష్ట్రాన్ని ఉత్తమ రాష్ట్రంగా తీర్చి దిద్ధి అన్ని వర్గాల ప్రజలకు అభివృద్ది ఫలాలు అందించేలా ఎన్డీయే కూట‌మి పాలన సాగుతుందన్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గాన్ని మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు ఎమ్మెల్యే బొండా ఉమా కృషిచేస్తున్నార‌ని కొనియాడారు. అనంత‌రం ఎమ్మెల్యే బొండా ఉమా మాట్లాడుతూ నియోజకవర్గంలో ప్రతి డివిజన్ లోను ప్రజా సమస్యలపై సంపూర్ణ అవగాహన తనకు ఉందన్నారు.ఆ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్న‌ట్లు తెలిపారు. ఇప్పటికే నియోజకవర్గంలో సుమారుగా 200 కోట్ల రూపాయల నిధుల‌తో అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు. ఇప్ప‌టికే కొన్ని పనులు పూర్తయినట్లు తెలిపారు..గత ఐదు సంవత్సరాల వైయస్సార్సీపి ప్రభుత్వ పాలనలో నియోజకవర్గం లో రోడ్లు సరిగ్గా లేక, అభివృద్ధి లేక ప్రజలు వాహనదారులు నరకయాతన అనుభవించారని గుర్తు చేశారు. ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయ‌క‌త్వంలో ప్రధానంగా అంతర్గత రహదారులు, మురుగునీటి కాలువల ఆధునీకరణ, మంచినీటి వసతి మెరుగుదల , వీధి దీపాల ఏర్పాటు వంటి మౌలిక సౌకర్యాల కల్పన పై దృష్టి సారించిన‌ట్లు తెలిపారు. ఈ కార్య‌క్ర‌మంలో మాజీ కార్పొరేటర్ లు పిరియ జగధాంబ, ఎరుబోతు శ్రావణి, డివిజన్ అధ్యక్షులు కుర్మపు దుర్గారావు, ప్రధాన కార్యదర్శి మల్లంపాటి రవి కుమార్, ఇంచార్జి పిరియ సోమేశ్వరరావు, ఆలా తారకరామారావు,దొండ పాటి సుల్తానా, రజిని, విజయ లక్ష్మి, అఫ్రోజ్, ఎస్.కె రహీం, శ్రీనివాస రావు రామ్మోహన్ గౌడ్, సముద్రాల చంద్రశేఖర్ ల‌తోపాటు తదితరులు పాల్గొన్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here