09-05-2024
ఎన్డీయే కూటమి గెలుపు ఖాయం, జగన్ ఓటమి తధ్యం కేశినేని జానకి లక్ష్మీ
28వ డివిజన్ లో ఎన్నికల ప్రచార ర్యాలీ
జానకి లక్ష్మీ, బొండా సుజాతలకు ఘన స్వాగతం
విజయవాడ : రాష్ట్రంలో జగన్ అరాచక పాలనకు చరమగీతం పాడేందుకు ప్రజలు సిద్దంగా వున్నారు.ఎన్నికుట్రలు, కుయుక్తులు పన్నినా ఎన్డీయే కూటమి గెలుపును ఎవరూ ఆపలేరని చంద్రబాబు ముఖ్యమంత్రి కావటం ఖాయం, జగన్ ఓటమి తధ్యమని కేశినేని జానకి లక్ష్మీ అన్నారు. ఎంపి అభ్యర్ధి కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే అభ్యర్ధి బొండా ఉమామహేశ్వరరావు విజయాన్ని కాంక్షిస్తూ వారి సతీమణులు కేశినేని జానకి లక్ష్మీ, బొండా సుజాత కలిసి 28వ డివిజన్ లో గురువారం ఎన్నికల ప్రచార ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ సత్యనారాయణ పురం లోని బాబురావు మేడ వద్ద నుంచి లక్ష్మీనగర్, శ్రీనగర్ కాలనీ వరకు సాగింది. వీరిద్దరికి ఆ డివిజన్ మహిళలు ఘన స్వాగతం పలికారు. అడుగడుగునా మంగళహారతులిచ్చారు. ఎన్నికల ప్రచార రధం వైపు వున్న కేశినేని జానకి లక్ష్మీ, బొండా సుజాత ఓటర్లకి అభివాదం చేయటంతో పాటు, విక్టరీ సింబల్ చూపిస్తూ సైకిల్ గుర్తుకి ఓటు వేయాలని అభ్యర్ధించారు.
ఈ సందర్భంగా కేశినేని జానకి లక్ష్మీ మాట్లాడుతూ చంద్రబాబు అధికారంలో రాగానే మహిళలకు అమలు చేయబోయే సంక్షేమ పథకాలు వివరించారు. జగన్ నాసిరకం మద్యంకి అనుమతులు ఇవ్వటం వల్ల ఎన్నో కుటుంబాలు రోడ్డుపాలవుతున్నాయన్నారు. మే13వ తేదీ ఓటర్లందరూ సైకిల్ గుర్తుకి ఓటు వేయాలని కోరారు.
అనంతరం కరెంట్ చార్జీలు తొమ్మిది సార్లు పెంచి విద్యుత్ వాడాలంటే భయపడేలా చేశాడని ఆవేశం వ్యక్తం చేశారు. ఎన్డీయే కూటమి అధికారంలోకి రాగానే చంద్రబాబు కరెంట్ చార్జీలు పెంచరని హామీ ఇచ్చినట్లు తెలియజేశారు. ఎన్డీయే అభ్యర్ధుల్ని సైకిల్ గుర్తు పై ఓటు వేసి గెలిపించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో 28వ డివిజన్ కార్పొరేటర్ వీరమాచినేని లలిత, డివిజన్ ప్రెసిడెంట్ శ్రీను, సెక్రటరీ పవన్, జోగినాయుడు, ధనలక్ష్మీ, భారతిలతోపాటు టిడిపి,బిజెపి,జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.