ఎన్డీఏ కార్యాలయంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కు ఘన నివాళి
రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 68 వ వర్ధంతి సందర్భంగా భవానిపురం ఎన్డీఏ కార్యాలయంలో కూటమి నేతలు ఘన నివాళులర్పించారు. కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ కూటమినేతలతో కలిసి అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ యువత రాజ్యాంగ నిర్మాతను ఆదర్శంగా తీసుకొని సమాజానికి ఉపయోగపడే విధంగా ఉండాలన్నారు. కూటమి నేతలు మాట్లాడుతూ సమాజంలో అణగారిన పేద ,వెనుకబడిన వర్గాలకు సామూహిక రక్షణ కల్పించిన మహోన్నత వ్యక్తి డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ అని కొనియాడారు. కార్యక్రమంలో కూటమి నేతలు ముదిరాజ్ శివాజీ, పత్తి నాగేశ్వరరావు, బాదర్ల శివ, నున్న కృష్ణ, లెవిన్ బాబు, విశ్వేశ్వరరావు, పడాల కృష్ణ, దేవిన హరిప్రసాద్,దొడ్ల రాజా, గడ్డం సాంబ, ఆవుల వెంకట ప్రసాద్, దాడి మురళి, సప్పా శ్రీనివాస్, లింగం శివప్రసాద్, గౌరీ శంకర్, యర్రంశెట్టి పద్మ కుమారి, తదితరులు పాల్గొన్నారు.