ఎన్డీఏ కార్యాలయంలో
ఎల్.ఓ.సీ ను అందజేసిన కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్
ఎమ్మెల్యే సుజనా చౌదరి సౌజన్యంతో మంజూరైన
(లెటర్ ఆఫ్ క్రెడిట్)
ఎల్.ఓ.సి లను
శుక్రవారం భవానిపురం
ఎన్డీఏ కార్యాలయంలో కార్యాలయ కార్యదర్శి
ప్రత్తిపాటి శ్రీధర్
అందజేశారు.
46 వ డివిజన్ సాయిరాం సెంటర్
కు చెందిన బల్లా గౌతమి(32) రెండు రోజుల ( బేబీ) పసి కందుకు జన్మనిచ్చారు. తక్కువ బరువుతో పుట్టిన నవజాత శిశువుకి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులు తెలపడంతో టీడీపీ సీనియర్ నాయకులు దీటి ప్రభుదాస్ ఎన్డీఏ కార్యాలయంలో వైద్యం సాయం కోసం దరఖాస్తు చేశారు.
మంజూరైన రూ 19 లక్షల 53 వేల
ఎల్. ఓ.సీ పత్రాన్ని బాధితురాలి కుటుంబ సభ్యులకు అందజేశారు
అదేవిధంగా 47 వ డివిజన్ చిట్టినగర్ కు చెందిన లింగమనేని సీతాపతి రావు ప్రమాదంలో గాయపడి ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అత్యవసర వైద్యం కోసం ఎన్డీఏ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోగా రూ 7లక్షల 74 వేల ఎల్. ఓ.సీ ను అందజేశారు ..
త్వరితగతిన ఎల్.ఓ.సీ మంజూరు చేసిన ఎమ్మెల్యే సుజనా చౌదరికి బాధితుల కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు.
కూటమి నేతలు దీటి ప్రభుదాస్ , అవ్వారు బుల్లబ్బాయి , సుజనా మిత్రా కోఆర్డినేటర్లు సప్పా శ్రీనివాస్, కొల్లి దుర్గారావు తదితరులు పాల్గొన్నారు..