భారతీయ జనతా పార్టీ
ఎన్డీఎ పక్షాల భాగస్వామ్యంతో తిరంగా యాత్ర.. బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి
అమరావతి…నేటి స్వాతంత్ర ఫలాలు ఆనాటి నేతల పోరాట ఫలితం ఈ చరిత్ర భవిష్యత్ తరాలకు తెలియచేయాల్సిన ఆవశ్యకత ఉందని బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి దగ్గుబాటి పురందేశ్వరి స్పష్టం చేశారు. దేశ మంతా విధ్యార్ధులతో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. బిజెవైఎం రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన తిరంగా యాత్రను ఆమె ప్రారంభించారు . ఈ సందర్భంగా మీడియాను ఉద్దేశించి మాట్లాడుతూ జాతీ యావత్తు ఒక పండుగ వాతావరణంలో నిర్వహించుకోవలసిన విషయంగా వివరించారు. పార్టీలకు అతీతంగా దేశ మంతా జాతీయ జెండాను ప్రతి ఇంటి పైన ఆవిష్కరించు కోవాలన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబును కలసి తిరంగా యాత్ర గురించి వివరించడం జరిగిందన్నారు కూటమి పార్టీలు కూడా భాగస్వామ్యంతో నే తిరంగా యాత్ర నిర్వహిస్తున్న విషయం మీడియాకు తెలిపారు.
జాతీయ జెండా చేత బూని తిరంగా యాత్రలు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్నామన్నారు. బిజెపి ఫ్లోర్ లీడర్ పెన్మెత్స విష్ణుకుమార్ రాజు, తెలుగుదేశం ఎమ్మెల్యే బొండా ఉమా తదితరులు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్ర మంలో తిరంగా యాత్ర ఇంఛార్జి ముని శుభ్రహ్మణ్యం బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు చంద్రమౌళి, మైనార్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు షేక్ బాజీ, రాష్ట్ర అధికార ప్రతినిధి యామినీ శర్మ, ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్, బబ్బూరి శ్రీరామ్, మాదాల రమేష్, భోగవల్లి శ్రీరధర్, కొలనపల్లి గణేష్, యువమోర్చా రాష్ట్ర అధ్యక్షుడు నరసరాజు , వివిధ విద్యాసంస్ధల విద్యార్ధులు తదితరులు పాల్టొన్నారు.
భారత్ మాతాకీ జై, మాతరం మాతర వందేమాతరం అంటూ నినాదాలతో విజయవాడ నగర వీధుల్లొ హోరెత్తించారు.