ఎన్టీఆర్ జిల్లా ఇన్చార్జి మంత్రివర్యులు సత్యకుమార్ యాదవ్ తో కలిసి పర్యటించిన శాసనసభ్యులు కృష్ణప్రసాదు
ఎన్టీఆర్ జిల్లా, ఇబ్రహీంపట్నం, 27.02.2025.
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మాత్యులు, ఎన్టీఆర్ జిల్లా ఇంచార్జ్ మంత్రివర్యులు సత్యకుమార్ యాదవ్ తో కలిసి మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాదు పర్యటించారు. ఇబ్రహీంపట్నంలోని జాకీర్ హుస్సేన్ కళాశాల సమీపంలో తెలుగుదేశం, జనసేన, బిజెపి పార్టీ కుటుంబ సభ్యులు ఏర్పాటు చేసిన ఓటర్ల సహాయక శిబిరాలను గురువారం సందర్శించారు. వీరితో పాటు ఉమ్మడి కృష్ణ-గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎన్నికల పరిశీలకురాలు, ఆంధ్రప్రదేశ్ మాదిగ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్పర్సన్ ఉండవల్లి శ్రీదేవి కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు కృష్ణప్రసాదుమాట్లాడుతూ మైలవరం నియోజకవర్గంలో శాంతియుత వాతావరణంలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయన్నారు. ఓటర్లు అందరూ వారి ఓటు హక్కును ప్రజాస్వామ్య బద్ధంగా స్వేచ్ఛగా వినియోగించుకుంటున్నారని పేర్కొన్నారు. ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వం అన్నారు. ఓటర్లకు సహాయపడుతున్న కూటమి కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మైలవరం నియోజకవర్గ బీజేపీ ఇంచార్జి నూతులపాటి బాల కోటేశ్వరరావు (బాల) కూటమి కుటుంబ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.