30-06-2024
ఎం.పి కేశినేని శివనాథ్ కు ఎమ్మెల్యే పి.విష్ణుకుమార్ రాజు ఆత్మీయ సత్కారం
విశాఖపట్టణం : విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ తన వైజాగ్ పర్యటనలో భాగంగా
వైజాగ్ నార్త్ బిజెపి ఎమ్మెల్యే పి.విష్ణుకుమార్ రాజును మర్యాద పూర్వకంగా ఆయన కార్యాలయంలో ఆదివారం కలవటం జరిగింది. తన కార్యాలయానికి విచ్చేసిన ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని)కు పుష్పగుచ్చం అందించి ఎమ్మెల్యే పి.విష్ణుకుమార్ రాజు స్వాగతం పలికారు. అనంతరం శాలువాతో సత్కరించారు. కాసేపు వీరిద్దరూ విశాఖ స్టీల్ ప్యాక్టరీ ఎదుర్కొంటున్న సమస్యలతో పాటు పలు రాజకీయ అంశాలపై చర్చించుకున్నారు.