ఎంపి కేశినేని శివనాథ్ కు శుభాకాంక్షలు మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న
1500 నోట్ బుక్స్ అందజేత
విజయవాడ : ఎంపి కేశినేని శివనాథ్ కు ఉత్తరాంధ్ర జిల్లాల ఇన్చర్జ్, మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న నూతన సంవత్సర, సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. శుక్రవారం గురునానక్ కాలనీలోని విజయవాడ పార్లమెంట్ కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో ఎంపి కేశినేని శివనాథ్ ను మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న కలిశారు. ఎంపి కేశినేని శివనాథ్ గతంలో ఇచ్చిన పిలుపు మేరకు శుభాకాంక్షలు తెలిపేందుకు పుష్పగుచ్ఛం, శాలువాలు తీసుకురాకుండా, విద్యార్ధులకు ఉపయోగ పడే విధంగా 1500 వైట్ లాంగ్ నోట్ బుక్స్ అందజేశారు. అనంతరం ఇద్దరు రాష్ట్ర రాజకీయాలతోపాటు, ఎన్టీఆర్ జిల్లా అభివృద్దిపై పలు అంశాలు చర్చించుకున్నారు.
ఈ కార్యక్రమం లో రాష్ట్ర మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి మహ్మాద్ పతావుల్లా, రాష్ట్ర కార్యదర్శి జంపాలసీతారామయ్య, టిడిపి నాయకులు చిన్నసుబ్బయ్య, సురభి బాలు, వొళ్లూరి సాంబశివరావు లతో పాటు తదితరులు పాల్గొన్నారు.