ఉర్ల ఓబనపల్లి గ్రామంలో మహిళలతో ముఖాముఖి కార్యక్రమం
కార్యక్రమం ప్రారంభంలో సభా ప్రాంగణం వద్ద చెట్టును నాటిన భువనేశ్వరి
నారా భువనేశ్వరిగారి స్పీచ్ పాయింట్లు
• ఉర్లఓబనపల్లి గ్రామానికి రావడం నాకు చాలా ఆనందంగా ఉంది..
• చంద్రబాబు పై మీకున్న అభిమానం, ప్రేమను 2024 ఎన్నికల్లో మరోసారి చాటుకున్నారు.
• ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి తెలుగువాడు ఏపీకి వచ్చి నిలబడి, గ్రామస్థాయి వరకు వెళ్లి మంచి, చెడులను వివరించి ఓట్లపై అవగాహన కల్పించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు.
• 2024 ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు తమ కుటుంబాల కోసం కాకుండా రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆలోచించారు..అందుకే ప్రజాప్రభుత్వం భారీ మెజార్టీతో అధికారంలోకి వచ్చింది.
• మీ ఓట్లతో ప్రజాప్రభుత్వాన్ని తీసుకొచ్చారు.
• 2014 పాలన చూసిన మీరు, 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ పాలనను కూడా చూశారు. అందుకే 2024లో మీకు ఏ ప్రభుత్వం అవసరమో ఓట్లతో తీర్పునిచ్చారు.
• చంద్రబాబును మీరు 8సార్లు ఎమ్మెల్యేగా, 4సార్లు ముఖ్యమంత్రిగా గెలిపించుకున్నారు.
• చంద్రబాబు ఉమ్మడి ఏపీలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏవిధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేశారో చూశారు. నేడు ఆ ఫలితాలను తెలంగాణ రాష్ట్ర పౌరులు అనుభవిస్తున్నారు.
• రాష్ట్ర విభజన అనంతరం చంద్రబాబు లోటు బడ్జెట్లో రాష్ట్ర పగ్గాలు చేపట్టారు..కానీ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు నడపించేందుకు ప్రయత్నించారు.
• 2019లో అధికారంలోకి రాకపోవడం వల్ల వైసీపీ నేతలు రాష్ట్రాన్ని భ్రష్టుపట్టించారు.
• నేడు వైసీపీ ప్రభుత్వం చేసిన తప్పులను సరిచేసేందుకు చంద్రబాబు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.
• వైసీపీ ఐదేళ్ల పాలన వల్ల రాష్ట్రానికి రాజధాని లేకుండా పోయింది…రాష్ట్రం అప్పుల్లో మునిగిపోయింది.
• రాష్ట్ర ప్రజలంతా చాలా ఓపికగా ఉండాలి…చంద్రబాబుకు కొంత సమయం ఇస్తే మీకు అభివృద్ధి కార్యక్రమాలు చేయడంతో పాటు సంక్షేమ పథకాలన్నీ అందిస్తారు.
• ఎన్నికల ముందు చంద్రబాబు ఇచ్చిన హామీలను అన్నింటినీ అమలు చేస్తారు…
• కార్యకర్తల త్యాగాలను మేం ఎప్పుడూ మరచిపోలేము…మీకు టీడీపీ ఎప్పుడూ రుణపడి ఉంటుంది.
• గతంలో కార్యకర్తల కోసం లోకేష్ అనేక కార్యక్రమాలు చేశారు…రానున్న కాలంలో మరిన్ని చేసి మిమ్మల్ని ముందుకు నడిపించే బాధ్యత మా కుటుంబంపై ఉంది.
• మా కుటుంబంపై మీరు చూపిస్తున్న ప్రేమాభిమానాలకు నా ధన్యవాదాలు, కృతజ్ఞతలు…