4-3-2025
ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లా పట్టభద్రుల MLC గా ఘనవిజయం సాధించిన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కి అభినందనలు -MLA బొండా ఉమ
ధి:-4-3-2025 మంగళవారం సాయంత్రం 6:00″గం లకు” విజయవాడ సింగ్ నగర్ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో NDA కూటమి మద్దతు ఇచ్చినటువంటి ఆలపాటి రాజేంద్రప్రసాద్ MLC గా అత్యధిక మెజారిటీతో గెలిపించిన గ్రాడ్యుయేట్స్ అందరికీ ప్రభుత్వ విప్, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు కృతజ్ఞతలు తెలియజేశారు
ఈ సందర్భంగా బొండా ఉమా కార్యాలయంలో కేక్ కట్ చేసి మిఠాయిలు పంచి విజయోత్సవాలను కార్యకర్తల నడుమ ఉత్సాహంగా చేసుకోవడం జరిగింది
మీడియా వారితో మాట్లాడుతూ:- 8 నెలల ఎన్డీఏ కూటమి పాలన ప్రజలందరూ ప్రధానంగా గ్రాడ్యుయేట్స్ ఆమోదించారు అని, వారు ఏ ఆశయాల కోసం ఎన్డీఏ కూటమికి ఓట్లు వేశారు ఆ విధముగా పాలన చేయడంతో పాటు మరింతగా అన్ని రంగాలలో ప్రజలు అనుకున్న స్థాయి కన్నా ఎక్కువగా పాలనను చేసి ప్రజల ఆమోదం పొందారు అని చెప్పటానికి నిదర్శనమే ఉమ్మడి కృష్ణ గుంటూరు జిల్లాలలో మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలే నిదర్శనమని నారా చంద్రబాబునాయుడు పవన్ కళ్యాణ్, పురందేశ్వరి మద్దతు ఇచ్చిన ఆలపాటి రాజా సుమారుగా 83వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందటమే నిదర్శనమని అన్నారు
ఎన్డీఏ ఆనాడు ఎన్నికల నేపథ్యంలో మేనిఫెస్టోలో పెట్టిన విధంగా నిరుద్యోగులు అందరికీ భవిష్యత్తులో నిరుద్యోగ భృతి, అతి త్వరలో మెగా డీఎస్సీ ఈ నవ్యాంధ్రప్రదేశ్ ను పారిశ్రామిక రాష్ట్రంగా అభివృద్ధి చేస్తూ అన్ని జిల్లాలలో నూతన పరిశ్రమలు పెట్టి, యువతకు విద్యార్థులకు ఉపాధి ఉద్యోగ అవకాశాలతో పాటు గ్రామీణ ప్రాంతంలోని యువతకు కూడా అన్ని రంగాలలో అవకాశాలు కల్పించేటువంటి విధముగా ముందుకు సాగుతుంది అని బొండా ఉమా వివరించారు
ఇప్పటికే పెన్షన్లు మూడువేల రూపాయల నుండి నాలుగు వేలు, 6వేలు మంచంలో ఉన్నటువంటి వారికి 15 వేల రూపాయలు వరకు ఇవ్వడమే కాకుండా అన్నా క్యాంటీన్లను తిరిగి ప్రారంభించడం, అర్హుల అందరికీ ఉచితంగా ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు, ఇచ్చిన సంగతిని గుర్తు చేస్తూ మహిళలు అందరికీ ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం త్వరలో తల్లికి వందనం, రైతులకు 20వేల రూపాయలు రైతు భరోసా, ఇవ్వబోతున్నామని వివరించడంతోపాటు రేపు జరగబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల లోపు పట్టణ ప్రాంతంలో ఉన్న పేదలకు రెండు సెంట్లు, గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి వారికి మూడు సెంట్లు ఇచ్చి ప్రతి కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకునేటువంటి బాధ్యత ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు తీసుకుంటారని విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఈ ఎన్డీఏ ప్రభుత్వం ఇచ్చేటువంటి అన్ని పథకాలను అర్హులైన లబ్ధిదారులకు అందించడమే కాకుండా నియోజకవర్గాన్ని అభివృద్ధి పరచి రాష్ట్రంలోనే సమస్యలు లేనటువంటి నియోజకవర్గంగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గాన్ని తీర్చిదిద్ది మోడల్ నియోజకవర్గంగా ముందుకు తీసుకు పోతామని దీనికి సహకరిస్తున్న సెంట్రల్ నియోజకవర్గ ప్రజానీకానికి అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలిపారు
ఈ కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర కార్యదర్శి సెంట్రల్ నియోజకవర్గ కోఆర్డినేటర్ నవనీతం సాంబశివరావు, మాజీ AMC డైరెక్టర్ ఘంటా కృష్ణ మోహన్, పాటి విజయ్ కుమార్, లబ్బా వైకుంఠం,కోలా శ్రీను,నాలం కోటేశ్వరరావు, మల్యాద్రి, నాగయ్య, చలం, చిరువెల్లి శ్రీనివాస్, నాగప్ప, రైల్వే ప్రసాదు, Sk బాబ్జి, లతోపాటు పెద్ద ఎత్తున తెలుగుదేశం జనసేన బిజెపి కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు