Home Political news ఉద్యోగ మేళాలో 1535 మంది ఎంపిక‌

ఉద్యోగ మేళాలో 1535 మంది ఎంపిక‌

3
0

 ఉద్యోగ మేళాలో 1535 మంది ఎంపిక‌

* ఇచ్చిన హామీ దిశగా అడుగులు… వందలాది మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాల కల్పన

* అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే యువతకు ఉద్యోగాలు

* వైసీపీ హయాంలో యువత గంజాయికి బానిస

* సీఎం చంద్రబాబు ప్రభుత్వంలో పరుగులెడుతున్న పారిశ్రామికాభివృద్ధి

* జాబ్ మేళా కార్యక్రమంలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావ్

ఎనికేపాడు:- రాష్ట్ర యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా నిరుద్యోగులు లేని రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దడమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు అన్నారు. ఎనికెపాడులో ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ యార్లగడ్డ వెంకట్రావ్ ఆధ్వర్యంలో శనివారం మెగా జాబ్ మేళా నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ఈ జాబ్ మేళాను ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మంత్రి నారా లోకేష్ యువగళం పాదయాత్రలో ఉద్యోగాల హామీ ఇచ్చారని తెలిపారు. ఆయనను స్ఫూర్తిగా తీసుకొని నియోజకవర్గ యువతకు ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా జాబ్ మేళా నిర్వహించినట్లు చెప్పారు. ఉద్యోగ మేళాకు యువ‌త నుండి విశేష స్పంద‌న క‌నిపించింద‌ని తెలిపారు. ఉద్యోగ మేళాలో మొత్తం 3125 మంది హాజ‌రుకాగా.. 1535 మందికి వివిధ కంపెనీల్లో ఎంపిక అయ్యారని చెప్పారు. వైసీపీ ప్రభుత్వంలో కంపెనీలు వెనక్కి తిరిగి వెళ్ళిన పరిస్థితి ఏర్పడిందన్నారు. జగన్ ప్రభుత్వ పాలనలో ఉద్యోగులు కూడా నిరుద్యోగులుగా మారిపోయారని విమర్శించారు. వైసీపీ ప్రభుత్వంలో యువత గంజాయి బారిన పడ్డారన్నారు. జగన్ తన పాలనలో రాజకీయ నిరుద్యోగులకు మాత్రమే ఉపాధి కల్పించారని విమర్శించారు. ‘‘నేను కేడీసీసి బ్యాంకును అభివృద్ధి చేస్తే అప్పటి ముఖ్యమంత్రి జగన్ నన్ను ఎందుకు చైర్మన్ బాధ్యతల నుంచి తప్పించారు’’ అని ప్రశ్నించారు. రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటు, కార్పొరేట్ కంపెనీల ఏర్పాటుపై ప్రభుత్వం దృష్టి సారించిందన్నారు. చంద్రబాబు సర్కార్ ఏర్పడిన తరువాత మల్లవల్లి ఇండస్ట్రియల్ కారిడార్‌కు పునర్జీవం పోశారన్నారు. నాడు జగన్ ప్రభుత్వం పేరు చెబితేనే పరిశ్రమలు పారిపోయే పరిస్థితి ఏర్పడిందన్నారు. మెగా జాబ్ మేళాలో 50 కంపెనీలు పాల్గొని ఉద్యోగ కల్పనకు అవకాశాలు కల్పించారని తెలిపారు. సింగ్‌నగర్‌లో వరదలు వస్తే ఏ వైసీపీ నాయకులైన వచ్చారా అని డిగారు. ‘‘చంద్రబాబు మా మీద పోటీ చేసి గెలువు అని సవాల్ విసిరిన నాయకులు ఇప్పుడు ఏమయ్యారు’’ అంటూ ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ప్రశ్నించారు. రాష్ట్రంలో తిరిగి వెళ్ళిన కంపెనీలు వెనక్కి రావడానికి సీఎం చంద్రబాబు కృషి ఎంతో ఉందన్నారు. చిన్న చిన్న పనులు కూడా వైసీపీ ప్రభుత్వం చేయలేకపోయిందన్నారు. 60 సంవత్సరాల వయసులో పార్టీ పెట్టిన వ్యక్తి ఎన్టీఆర్ అని పేదవాడికి పట్టేడు అన్నం పెట్టాలని 2 రూపాయలకు కిలో బియ్యం పధకం తెచ్చిన మహానుభావుడు ఎన్టీఆర్ అని కొనియాడారు. ఆ పధకానికి కూడా గత ప్రభుత్వం తూట్లు పొడిచిందని విమర్శించారు. ఇచ్చిన హామీ మేరకు యువతకు ఉద్యోగాలు కల్పించే లక్ష్యంతో మెగా జాబ్ మేళా నిర్వహించినట్లు తెలిపారు. జాబ్ మేళాలో పాల్గొన్న 53 కంపెనీలకు ఎమ్మెల్యే ధన్యవాదాలు తెలిపారు. అనంతరం మెగా జాబ్ మేళాలో ఉద్యోగాలకు సెలెక్ట్ అయిన వారికీ ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు సర్టిఫికెట్స్ పంపిణీ చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here