Home Political news ఉద్యానవన, వ్యవసాయం, మార్కెటింగ్ శాఖల సమన్వయంతో మామిడి రైతుల అభివృద్ధికి కృషి…రాష్ట్ర సమాచార శాఖ, గృహనిర్మాణ...

ఉద్యానవన, వ్యవసాయం, మార్కెటింగ్ శాఖల సమన్వయంతో మామిడి రైతుల అభివృద్ధికి కృషి…రాష్ట్ర సమాచార శాఖ, గృహనిర్మాణ శాఖల మంత్రి కొలుసు పార్ధసారధి

3
0

 *నూజివీడు మామిడికి ప్రపంచ స్థాయి గుర్తింపునకు మనమందరం సమిష్టిగా కృషి చేద్దాం*

*నూజివీడులో మామిడి మార్కెటింగ్ సౌకర్యాలు మెరుగుకు ప్రత్యేక యార్డ్, రైతులకు, వ్యాపారస్తులకు సౌకర్యాల ఏర్పాటుకు చర్యలు…*

ఉద్యానవన, వ్యవసాయం, మార్కెటింగ్ శాఖల సమన్వయంతో మామిడి రైతుల అభివృద్ధికి కృషి…రాష్ట్ర సమాచార శాఖ, గృహనిర్మాణ శాఖల మంత్రి కొలుసు పార్ధసారధి

మామిడి రైతులకు అవగాహన సదస్సులు

          ఏలూరు/నూజివీడు, జులై 04: నూజివీడు మామిడికి ప్రపంచ స్థాయి గుర్తింపునకు మనమందరం సమిష్టిగా కృషి చేద్దామని రాష్ట్ర సమాచార శాఖ, గృహనిర్మాణ శాఖల మంత్రి కొలుసు పార్ధసారధి వెల్లడించారు. గురువారం నూజివీడులోని మార్కెట్ యార్డు అవరణలో ఏర్పాటు మామిడి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, మార్కెట్ యార్డు ఏర్పాటుకు సంబంధించిన అంశాలపై నూజివీడు, చాట్రాయి, ముసునూరు, మండలాలతో పాటు యన్.టి.ఆర్. జిల్లా విస్సన్నపేట, తిరువూరు, మైలవరం, రెడ్డిగూడెం, ఎ. కొండురు పరిసర ప్రాంతాల మామిడి రైతులు, వ్యాపారస్తులు, సంబంధిత అధికారులు, శాస్త్రవేత్తలు, రాష్ట్ర సమాచార శాఖ, గృహనిర్మాణ శాఖల మంత్రి కొలుసు పార్ధసారధి ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. సమక్షంలో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి పార్థసారథి మాట్లాడుతూ నూజివీడు మామిడికి ప్రపంచస్థాయి బ్రాండ్ ఉందని దాని స్థాయిని మరింత పెంచేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. నూజివీడు మామిడికి మరింత మార్కెటింగ్ సౌకర్యాలు కల్పించి రైతులకు లబ్దిచేకూరేలా నూజివీడులో రాబోయే మామిడి సీజన్ కు మామిడి మార్కెట్ యార్డు ఏర్పాటు, అభివృద్ధికి ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకుంటామన్నారు.జిల్లాలోని మామిడి రైతులు ఆధునిక పద్ధతులతో సాగుచేసి నాణ్యమైన పండ్ల ఉత్పత్తులను సాధించాలని అదే విధంగా దిగుబడితోపాటు , ఎగుమతులు చేసి అధిక లాభం పొందేలాగా ఉద్యాన వన వ్యవసాయ, మార్కెటింగ్ శాఖల సమన్వయంతో సాధించాలని మంత్రి పేర్కొన్నారు. రైతులకు ఇన్సూరెన్స్ సమస్యపై కూడా చర్యలు తీసుకుంటానని తెలిపారు. మామిడి పరిశోధనా కేంద్రం శాస్త్రవేత్తలు, సిబ్బంది కొరత కారణంగా సమస్యలు ఎదుర్కొంటున్నామని తెలియజేయడం జరిగిందని దానిని అధికమించడానికి కృషి చేస్తానన్నారు. నాణ్యమైన, అధికదిగుబడి రకాల ఉత్పత్తికి శాస్త్రవేత్తల పరిశోధనలు క్షేత్రస్థాయిలో రైతులకు చేరినప్పుడే వాటికి సార్ధకత ఏర్పడుతుందన్నారు. శాస్త్రవేత్తలు వారు చేసే పరిశోధనలు క్షేత్రస్ధాయికి వెళ్లి రైతుల పంటలను పరిశీలించి తగుసూచనలు ఇవ్వాలని మంత్రి అన్నారు. త్వరలోనే సంబంధిత శాఖలతో మామిడి రైతులకు పంట మెళుకువలపై యువ రైతాంగానికి శిక్షణ ఇవ్వడం జరుగుతుందని, అదే విధంగా ఫ్రూట్ కవర్స్ పంపిణీ చేయడానికి చర్యలు తీసుకుంటానని తెలిపారు. సమావేశంలో రైతుల సమస్యలను పూర్తిస్ధాయిలో అవగాహన చేసుకున్నానని సంబంధిత అధికారులతో విజయవాడలో సమావేశమై మామిడి రైతులకు అవసరమైన అన్ని సౌకర్యాలను కల్పించడానికి సంబంధిత వ్యవసాయ శాఖ మంత్రి వర్యులతో సంప్రదించి పూర్తిస్ధాయిలో మామిడి రైతులను ఆదుకోవడం జరుగుతుందని తెలిపారు. 

              ఈ సమావేశంలో మామిడి రైతులు మామిడి పంటకు సంబంధించిన వివిధ సమస్యలపై సమావేశంలో మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. వీటిలో మామిడి కాయకు గతంలో ప్రభుత్వం ఫ్రూట్స్ కవర్ లు రైతులకు సప్లైయి చేసేదని అది తిరిగి పునరుద్దరించాలని, మార్కెట్ లో మామిడికి ఉపయోగించే క్రిమిసంహారిక మందులు డూప్లికేట్ వస్తున్నాయని దీనిని అరికట్టాలని నాణ్యమైన క్రిమి సంహారిక మందులు సప్లైయి చేయాలని, చింతలపూడి ఎత్తిపోతుల పధకాన్ని అభివృద్ధి చేసి మామిడి రైతులను ఆదుకోవాలని, జాతీయ ఉపాధిహామీ పనుల పధకాన్ని రైతులకు అనుసంధానం చేయాలని, నూజివిడులో మామిడి మార్కెట్ యార్డు లేక రైతాంగం నష్టపోతుందని మార్కెట్ యార్డు ఏర్పాటు చేయాలని, రైతులకు మామిడి పంటకు భీమా సౌకర్యం కల్పించాలని మామిడి పరిశోధనా కేంద్రం వల్ల మామిడి రైతులకు ఎటువంటి సాకారం అందడం లేదని, రైతులకు మామిడి పంటపై పూర్తిస్ధాయిలో అవగాహన సదస్సులు నిర్వహించాలని, పండు ఈగ వల్ల సంభవించే మామిడి పంట నష్టాన్ని అరికట్టడానికి సరైన మందులను సూచించాలని రైతులు వారియొక్క ఆవేదనను మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. అదే విదంగా మామిడి ఎగుమతులు, మామిడి ఫ్రోసెస్ యూనిట్ ఏర్పాటు, మామిడి వ్యాపారస్ధుల సమస్యలను మంత్రి దృష్టికి తేవడం జరిగింది. అనంతరం మంత్రి పార్ధసారధి మామిడి వ్యాపారస్ధులను, మామిడి రైతులనుద్ధేశించి మాట్లాడుతు త్వరలో నూజివీడులో మామిడి మార్కెట్ యార్డు ఏర్పాటుకు అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలతో ఏర్పాటు చేయడానికి ప్రభుత్వ పరంగా కృషి చేస్తానని తెలిపారు. 

        కార్యక్రమంలో ఉద్యానవన శాఖ డైరెక్టర్ వెంకటేశ్వరరావు, జిల్లా ఉద్యానవనాలు శాఖాధికారి ఎస్. రామ్మోహన్, ఏపి ఎంఐపి ప్రాజెక్ట్ అధికారి పి. రవికుమార్, శాస్త్రవేత్త డా.కనకమహాలక్ష్మి, మార్కెట్ యార్డ్ కార్యదర్శి శ్రీనివాస్, రైతులు, వ్యాపారులు , మామిడి ప్రాసెసింగ్ యూనిట్ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రభృతులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here