ఈ 11న మంత్రులు.
కార్యదర్శుల సమావేశం
సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఈ నెల 11న మంత్రులు, ప్రభుత్వ శాఖల కార్యదర్శుల సదస్సు జరగనుంది.
సచివాలయంలోని ఒకటో బ్లాక్ ఉదయం 10.30 నుంచి సాయంత్రం 6.30 గంటల వరకు ఈ సమావేశం నిర్వహిస్తారు.
మ్యానిఫెస్టోలో పేర్కొన్న హామీల అమలు, కేంద్ర బడ్జెట్ ద్వారా రాష్ట్రానికి వచ్చే ఆర్థిక ప్రయోజనాలు, ఇతర అంశాల గురించి ఈ సదస్సులో చర్చిస్తారు.
అన్ని శాఖల బడ్జెట్ ప్రతిపాదనలు పంపించాలని ఇప్పటికే అన్ని విభాగ అధిపతులకు ఆదేశాలు ఇచ్చారు.
కార్యదర్శులు తమ శాఖలకు సంబంధించిన అంశాలు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు.
ఈ సమావేశ ఏర్పాట్లు సాధారణ పరిపాలన శాఖ (GAD) ముఖ్య కార్యదర్శి ముకేష్ కుమార్ మీనా సమీక్షిస్తున్నారు.