ధి:-7-6-2025 శనివారం ఉదయం 9:30″గం లకు” సెంట్రల్ నియోజకవర్గంలోని 61 వ డివిజన్ దేవినేని గాంధీ పురం చెరువు పార్క్ వెనకమాల నూతన సీసీ రోడ్లు కోటి 27 లక్షల రూపాయల వ్యయంతో చేపట్టి ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు పూజలు నిర్వహించి కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేశారు
ఈ సందర్భంగా బొండా ఉమా మాట్లాడుతూ నియోజకవర్గంలో పనిచేసే MLA ఉంటే ఏ విధంగా ప్రజలకు అవసరమైనటువంటి మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేసి చూపించవచ్చో తాను ఎన్నికైన నాటి నుండే పనులు చేపట్టానని
ఇప్పటికే నియోజకవర్గంలో NDA కోటమి ప్రభుత్వం ఏర్పడిన 1 సంవత్సర కాలంలో ₹200 కోట్ల రూపాయల వ్యయంతో అభివృద్ధి పనులు చేపట్టినట్లు, తెలుగుదేశం ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సాధించింది అని, ఆ క్రమంలో నియోజకవర్గంలో ప్రతి డివిజన్ లోను అభివృద్ధి పనులను శరవేగంగా సాగుతున్నాయని, మా దృష్టికి వచ్చినటువంటి ప్రతి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ ఉమ్మడి రమాదేవి, డివిజన్ అధ్యక్షులు ఆకుల సూర్య ప్రకాష్, ప్రధాన కార్యదర్శి అమ్మ రావు ఇంచార్జ్ దాసరి దుర్గారావు, దాసరి ఉదయశ్రీ, దాసరి కనకారావు, తదితరులు పాల్గొన్నారు.