శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, విజయవాడ :
ఈరోజు మాజీ రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్ కుటుంబసభ్యులతో కలిసి అమ్మవారి దర్శనార్థం ఆలయమునకు విచ్చేయగా ఆలయ ఈవో కె.ఎస్ రామరావు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి, అమ్మవారి దర్శనం కల్పించారు.
అనంతరం ఆలయ వేదపండితులు వీరికి వేదార్వచనం చేయగా ఈవో అమ్మవారి శేషవస్త్రం, ప్రసాదం మరియు చిత్రపటం అందజేశారు.
ఈ కార్యక్రమంలో ఈవో తో పాటుగా ఆలయ డిప్యూటీ ఈవో ఎమ్.రత్న రాజు మరియు ఆలయ అధికారులు పాల్గొన్నారు.