శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి:
ఈరోజు అనగా తేది.06-07-2024, ఆషాఢ శుద్ధ పాడ్యమి, శనివారం ఉదయం 8-00 గం లకు ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా ఆలయ వైదిక సిబ్బంది మరియు పరిపాలన సిబ్బంది అందరూ కుటుంబ సభ్యులుతో కలిసి కనకదుర్గ నగర్ నుంచి ఊరేగింపుగా విచ్చేయగా ఆలయ కార్యనిర్వాహనాధికారి కె ఎస్ రామరావు వీరికి మంగళ వాయిద్యముల నడుమ ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు.
అనంతరం వీరు అమ్మవారి దర్శనం చేసుకొని, అనంతరం మహామండపం 6వ అంతస్తు చేరుకున్నారు.
అనంతరం మహామండపం 06 వ అంతస్తు నందు ఏర్పాటు చేసిన అమ్మవారి ఉత్సవ విగ్రహం వద్ద ఆలయ అర్చకులు పూజలు నిర్వహించి వీరికి ఆశీర్వచనం అందజేయడం జరిగినది.
ఈ కార్యక్రమంలో ఆలయ స్థానాచార్యులు విష్ణు భట్ల శివప్రసాద శర్మ గారు, మరియు వైదిక సిబ్బంది, పూజలు నిర్వహించి వీరికి ఆశీర్వచనం అందజేయడం జరిగినది.
ఈ కార్యక్రమంలో ఆలయ స్థానాచార్యులు విష్ణు భట్ల శివప్రసాద శర్మ మరియు వైదిక సిబ్బంది, ఆలయ అధికారులు, కార్యనిర్వాహక ఇంజినీర్లు,సహాయ కార్యనిర్వాహణాధికారి వార్లు మరియు అన్ని విభాగముల సిబ్బంది పాల్గొన్నారు.