ఈనెల 21వ తేదీన ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం శుభాకాంక్షలు – గరికిన పైడిరాజు

Spread the love

ఈనెల 21వ తేదీన ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం శుభాకాంక్షలు – గరికిన పైడిరాజు

విజయవాడ: జి.పి.ఆర్ ఛారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ గరికిన.పైడిరాజు మత్స్యకారుల ప్రజలకు, నాయకులకు శుభాకాంక్షలు తెలిపారు ఆదివారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ చెరువులు, సరస్సులు, నదులు, సముద్రాల ఒడ్డున జీవిస్తున్న శ్రమజీవులైన మత్స్యకారులు, చేపల మార్కెట్లు, ఈ నెల 21న ప్రపంచ మత్స్యకారులు దినోత్సవాన్ని ఆనందోత్సాహాల నడుమ, అన్ని వర్గాల ప్రజలందరితో కలసిమెలసి పండుగలా జరుపుకోవాలని తెలిపారు. అందరూ ప్రేమతో మెలగాలని శాంతిని పెంచాలని “శాంతి భారత్” సాధనకు తమ జి.పి.ఆర్ ఛారిటబుల్ ట్రస్టు కృషి చేస్తుందన్నారు.కేంద్ర, రాష్ట్ర పధకాలు అందరికి అందేటట్లుగా ప్రవేశపెట్టి సామాజిక, ఆర్థిక, రాజకీయ, విద్యా రంగాల్లో సామాజిక న్యాయం కల్పించలాని ప్రధానమంత్రి నరేంద్రమోడి,రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు,ఉప
ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ హృదయపూర్వకంగా కోరారు.ఇతర రాష్ట్రాలలో ఎస్.టి జాబితాలో ఉన్నారని మన రాష్ట్రంలో మత్స్యకారులు ఇంకా వెనుకబడి ఉన్నందున ఎస్.టి. జాబితాలో చేర్చాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పాలసీలు, స్కీములు, పారిశ్రామిక అభివృద్ధి, దేశ మౌలిక వసతుల కల్పనలో మత్స్యకార సామాజిక వర్గ అబివృద్ధికి, వికాసానికి అవగాహన కల్పించవల్సిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో మత్స్యకారుల నాయకులు పీతా ఈశ్వర ప్రసాద్, చిన్ని చిట్టిబాబు,కన్నా మామిడయ్య, వినోద్ కుమార్ ,ప్రవీణ్ ,జి. యమ్. దుర్గాప్రసాద్ రాజు , కృష్ణారెడ్డి,హరిబాబు తదితరులు పాల్గొన్నారు…

Loading