Home Andhra Pradesh ఇంద్ర కీలాద్రి ప్రత్యేక ఉత్సవాలకు సన్నద్ధం కావాలి

ఇంద్ర కీలాద్రి ప్రత్యేక ఉత్సవాలకు సన్నద్ధం కావాలి

4
0

శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం, ఇంద్ర కీలాద్రి, విజయవాడ.

“13 జూన్ 2025”

ప్రత్యేక ఉత్సవాలకు సన్నద్ధం కావాలి

ఇంద్రకీలాద్రిపై ఆషాఢమాసం సందర్బంగా జరిపే ప్రత్యేక ఉత్సవాల నిర్వహణకు సన్నద్ధం కావాలని ఆలయ కార్యనిర్వహణాధికారి వి. కె.శీనానాయక్ అన్నారు.

ఈరోజు సాయంత్రం మహా మండపం లో ఆలయ వైదిక సిబ్బంది, కార్యాలయసిబ్బంది తో సమావేశం జరిపారు.

జూన్ 26 నుండి జూలై 24 వరకు అమ్మవారికి ఆషాఢ సారె సమర్పణ, జూన్ 26 నుండి జూలై 04 వరకు వారాహి నవరాత్రులు (గుప్త నవరాత్రులు), జూలై 08 నుండి జూలై 10 వరకు శాకంబరీ దేవి ఉత్సవాలు జరుగనున్నందున అన్ని ఏర్పాట్లు సక్రమంగా చేయాలని, ఆధ్యాత్మికంగా, ధార్మికంగా మరింత ఉన్నతంగా కార్యక్రమములు నిర్వహించాలని ఈవో కోరారు.
ఈ సంవత్సరం భక్తులసంఖ్య పెరిగే అవకాశం ఉందని, అభివృద్ధి పనులు జరుగుతున్న నేపథ్యంలో భక్తులకు అసౌకర్యం కలుగకుండా చూడాలని కోరారు.

ఈ కార్యక్రమం లో వన్ టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గురు ప్రకాష్, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ కోటేశ్వరరావు, వైదిక కమిటీ సభ్యులు వి. శ్యావాశ్వ మహర్షి, సి హెచ్. ఆంజనేయ ఘనాపాటి, ప్రధాన అర్చకులు ఎల్. దుర్గా ప్రసాద్, ఉప ప్రధాన అర్చకులు కోట ప్రసాద్, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ ఎన్. రమేష్ బాబు, శ్రీ బి. వెంకట రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here