ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం అభివృద్ధి కి మాస్టర్ ప్లాన్ రూపొందించిన శాసనసభ్యులు సుజనా చౌదరి
ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో అభివృద్ధి పనుల కోసం రూపొందించిన మాస్టర్ ప్లాన్ తుదిమెరుగులు దిద్దుకుంటోంది. ఈ మేరకు శాసనసభ్యులు సుజనా చౌదరి ఆలయాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి పరచనున్నారు. ఫలితంగా రానున్న కాలంలో భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా మార్పులు చేర్పులు చేసేందుకు ఈ మాస్టర్ ప్లాన్ దోహదపడనుందని భావిస్తున్నారు. గురువారం తాడిగడప లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో దుర్గగుడి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. త్వరలో జరగబోయే భవాని దీక్షల విరమణ, కొండపైకి (ఎస్కలేటర్లు) లిఫ్ట్ ల ఏర్పాటు క్యూ లైన్లలో భక్తులకు దాహర్తి తీర్చడం కోసం ఆర్ఓ ప్లాంట్ల ఏర్పాట్లు పరిశీలన ఉచిత అన్నప్రసాదాలు మరియు దుర్గగుడి అభివృద్ధి కోసం మాస్టర్ ప్లాన్ ఏర్పాటుచేసి దుర్గగుడి ఈవో కె ఎస్ రామారావు, టెక్నికల్ టీం కొండలరావు , ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లతో ఎమ్మెల్యే సుజనా సమీక్ష నిర్వహించారు. ఆలయ అభివృద్ధిని ప్రతిష్టాత్మకంగా తీసుకుని సదుపాయాలని మెరుగుపరుస్తూ చేయవలసిన పనులను వివరించి సలహాలు, సూచనలను సుజన చౌదరి స్వీకరించారు.