శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి, విజయవాడ.”22 మే 2025″ఇంద్రకీలాద్రి పై హనుమజ్జయంతి ప్రత్యేక పూజలుపవిత్ర ఇంద్రకీలాద్రి క్షేత్రపాలకుడైన శ్రీ ఆంజనేయ స్వామి వారికి హనుమజ్జయంతి సందర్బంగా ఈరోజు ఉదయం నుండి ప్రత్యేక పూజలు వైభవం గా జరిగాయి. ఉదయం 6 గంటల నుండి – అమ్మవారి ఆలయప్రాంగణంలో గలక్షేత్ర పాలక శ్రీ ఆంజనేయస్వామి, ఘాట్ రోడ్ లో గల ఆంజనేయస్వామి,పాత మెట్లు మార్గంలో గల ఆంజనేయ స్వామి ఆలయంలో అభిషేకములు, నాగవల్లీ దళార్చన, రుద్ర సహిత మన్యు సూక్త హోమ కార్యక్రమములు, పూర్ణాహుతి మంత్రపూర్వకంగా జరిగాయి.ఆలయ కార్యనిర్వహణాధికారి వి. కె. శీనానాయక్ ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఉప ప్రధాన అర్చకులు శ్రీ శంకర శాండిల్య, శ్రీ కోట రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.
