ఇంద్రకీలాద్రి పై భోగి పండ్లు కార్యక్రమం:
శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి, విజయవాడ :
ఈరోజు భోగి సందర్బంగా దేవస్థానం మహమండపం 7 వ అంతస్తు నందు పెద్ద రాజగోపురం ఎదురుగా ఉన్న ప్రాంగణం నందు బొమ్మల కొలువు దగ్గరలో విద్యార్థినులచే సంధ్య గొబ్బెమ్మలు ఏర్పాటు చేసి, పూజలు నిర్వర్తించి, గొబ్బి పాటలు పాడి, నృత్యం చేసి, చిన్నారులకు మరియు విధ్యార్థినులకు భోగి పండ్లు పోయు కార్యక్రమం శాస్త్రోక్తముగా నిర్వహించడం జరిగినది. అనంతరం వీరికి ప్రసాదం అందజేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో ఆలయ స్థానాచార్యులు విష్ణుభట్ల శివప్రసాద శర్మ , ఆలయ సిబ్బంది, అర్చక సిబ్బంది,కంచి కామకోటి పీఠం వారి సంప్రదాయ పాఠశాల సంప్రదాయ పాఠశాల విద్యార్థినులు, చిన్నారులు పాల్గొన్నారు.