శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి, విజయవాడ.
14 జూన్ 2025
జగన్మాతకు వాహన, వస్తు కానుకలు
ఇంద్రకీలాద్రి పై కొలువైన జగన్మాత శ్రీ కనకదుర్గమ్మ వారికి వాహన, వస్తు కానుకలను భక్తులు సమర్పించారు.
వరంగల్ కు చెందిన జి. భూపాల్ రెడ్డి వారు కుటుంబంతో విచ్చేసి, దేవస్థానంనకు రూ. 4,75,000/- విలువ గల Renault Kwid కారు, 21గ్రాముల బరువు గల ముత్యాలు, రాళ్లు పొదిగిన బంగారు నక్లేస్ సమర్పించారు.
ఆలయకార్యనిర్వహణాధికారి వి.కె.శీనానాయక్ వారికి అప్పగించారు.
భక్తుని కుటుంబంనకు అమ్మవారి దర్శనం,వేద ఆశీర్వచనం, ప్రసాదం అందజేశారు.