ఆలయ పరిశుభ్రత కార్యక్రమంలో స్వయంగా పాల్గొన్న ఛైర్మన్ బొర్రా రాధాకృష్ణ (గాంధీ)

Spread the love

శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారల దేవస్థానం, ఇంద్రకీలాద్రి, విజయవాడ
తేదీ: నవంబర్ 6, 2025
ఆలయ పరిశుభ్రత కార్యక్రమంలో స్వయంగా పాల్గొన్న ఛైర్మన్ బొర్రా రాధాకృష్ణ (గాంధీ)

ఇంద్రకీలాద్రిపై వెలసిన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం ఛైర్మన్ బొర్రా రాధాకృష్ణ (గాంధీ) గారు ఈరోజు ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన పరిశుభ్రత మరియు ప్రక్షాళన కార్యక్రమంలో స్వయంగా పాల్గొన్నారు.
దేవాలయాన్ని ఎల్లప్పుడూ పరిశుభ్రంగా, పవిత్రంగా ఉంచాలనే లక్ష్యంతో, శానిటేషన్ (పారిశుద్ధ్య) సిబ్బందిని అన్ని విధాలా ప్రోత్సహించి, వారిలో స్ఫూర్తిని నింపేందుకు ఛైర్మన్ ఈ వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు. శానిటేషన్ (సిబ్బందితో కలిసి ఆలయ పరిసరాలను శుభ్రం చేసి, భక్తులకు స్వచ్ఛమైన వాతావరణాన్ని అందించడంలో ప్రతీ ఒక్కరూ భాగస్వాములు కావాలని సందేశం ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో పారిశుద్ధ్య సిబ్బంది పాల్గొన్నారు. భక్తులందరికీ అమ్మవారి దర్శనం సులభతరంగా, స్వచ్ఛమైన వాతావరణంలో కల్పించడమే తమ ప్రధాన ధ్యేయమని ఛైర్మన్ ఈ సందర్భంగా తెలియజేశారు.

Loading