ఆలపాటి రాజేంద్రప్రసాద్ గెలుపు.. పెద్దల సభకు అలంకారం
ఆలపాటి గెలుపు లాంఛనమే.. మెజార్టీ ముఖ్యం
ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కూటమి ప్రభుత్వంతోనే సాధ్యం
పట్టభద్రుల ఆత్మీయ సమావేశంలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావ్
ఆలపాటి రాజేంద్రప్రసాద్ గెలుపు.. పెద్దల సభకు అలంకారమని ప్రభుత్వ విప్, గన్నవరం శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావ్ అన్నారు. ఉమ్మడి కృష్ణా, గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గ శాసనమండలి ఎన్నికల్లో పోటీ చేస్తున్న కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్రప్రసాద్ ను బలపరుస్తూ సోమవారం పోరంకిలోని మురళీ రిసార్ట్స్ లో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావ్ అధ్యక్షతన గన్నవరం పట్టభద్రుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి కొల్లు రవీంద్ర, కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్రప్రసాద్, కూటమి నేతలు, తెలుగు యువత, పార్టీ కార్యకర్తలు, పట్టభద్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యార్లగడ్డ మాట్లాడుతూ మెజార్టీ ఓట్లు పోల్ అయ్యేలా తెలుగుయువత సభ్యులు పనిచేయాలని సూచించారు. అప్పుడే ఎక్కువ మెజార్టీ సాధ్యమవుతుందని వెల్లడించారు. ఆలపాటి గెలుపు లాంఛనమే అని అన్నారు. ఆలపాటి రాజేంద్రప్రసాద్ టీడీపీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ కు ఎంతో సన్నిహితంగా వున్నారని గుర్తు చేశారు. పెద్దల సభకు ఆలపాటి రాజేంద్రప్రసాద్ వెళ్తే సభకు అలంకారమని అన్నారు. ప్రపంచంలో తెలుగువారు ఎక్కడ ఉన్న అందులో ప్రథమంగా గన్నవరం నియోజకవర్గ ప్రజలు ఉంటారని చెప్పారు. గతంలో ఎన్నడూ లేని మెజార్టీని తనకు ఇచ్చారని నియోజకవర్గ ప్రజలకు ఎప్పుడు రుణపడి ఉంటానని చెప్పారు. యువతకు ఉద్యోగ, ఉపాధి కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమని చెప్పారు. గత ప్రభుత్వం అభివృద్ధిని అడ్డుకుందని విమర్శించారు. పరిశ్రమలు తరలివెళ్ళిపోయాయని, అంతర్జాతీయ విమానాశ్రయం సమీపాన ఉన్న ఆసుపత్రి దుస్థితి గత ప్రభుత్వ పాలనకు నిదర్శనమని ఎద్దేవా చేశారు. అభివృద్ధి గురించి తెలియని ప్రభుత్వానికి, అభివృద్ధి అంటే ఏంటో తెలిసిన ప్రభుత్వానికి తేడా ఆరునెలల పాలనలోనే ప్రజలకు అర్దమయ్యిందన్నారు. అలాంటి అభివృద్ధి చేస్తున్న కూటమి అభ్యర్థి ఆలపాటి ని అఖండ మెజార్టీతో గెలిపించాలని గన్నవరం నియోజకవర్గం నుండి అత్యధిక మెజార్టీ ఇవ్వాలని పట్టభద్రులకు ఎమ్మెల్యే యార్లగడ్డ పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో టిడిపి పరిశీలకులు వడ్రాణం హరిబాబు నాయుడు, రాష్ట్ర టిడిపి కార్యనిర్వాహణ కార్యదర్శి చిరుమామిళ్ళ సూర్యం, రాష్ట్ర టిడిపి కార్యదర్శి బచ్చుల సుబ్రహ్మణ్యం (బోసు), గన్నవరం నియోజకవర్గ జనసేన సమన్వయకర్త చలమలశెట్టి రమేష్ బాబు, బిజెపి రాష్ట్ర కిసాన్ మోర్చా నాయకులు కుమారస్వామి, గన్నవరం నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల పరిశీలకులు కోట వీరబాబు, రాష్ట్ర తెలుగుమహిళా ప్రధాన కార్యదర్శి మూల్పూరి సాయి కళ్యాణి, రాష్ట్ర వాణిజ్య విభాగం అధికార ప్రతినిధి గూడవల్లి నరసింహారావు, రాష్ట్ర టిడిపి రైతు విభాగం నాయకులు గుండపనేని ఉమా వరప్రసాద్, వేములపల్లి శ్రీనివాసరావు, ఆళ్ళ వెంకట గోపాలకృష్ణ, గన్నవరం నియోజకవర్గ బిజెపి నాయకులు ఫణి కుమార్, దయాల రాజేశ్వరరావు, గొడ్డళ్ళ చిన్న రామారావు, వేగిరెడ్డి పాపారావు, చిమట రవివర్మ, మేడేపల్లి రమ, నబిగాని కొండయ్య, బోడపాటి రవికుమార్, మజ్జిగ నాగరాజు,పరుచూరి నరేష్ ,తంగిరాల శ్రీనివాసరావు, దాసరి మహేష్, కొల్లా ఆనంద్, సర్నాల బాలాజీ, బొమ్మసాని అరుణకుమారి, మద్దుకూరి విజయ్ కుమార్, ఉప్పులూరి స్వర్ణ కుమారి మరియు టిడిపి, జనసేన, బిజెపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.