09-05-2024
ఆర్యవైశ్య నాయకులకి టిడిపిలో పదవులు
నియమాక పత్రాలు అందించిన కేశినేని శివనాథ్
విజయవాడ : పశ్చిమ నియోజకవర్గం ఆర్యవైశ్య టిడిపి నాయకులకి పార్టీలో వివిధ హోదాల్లో పదోన్నతులు లభించాయి. తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శిగా వి.వి.కె.నరసింహారావు , తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ జిల్లా కార్యనిర్వహక కార్యదర్శి గా నూకల నాగేశ్వరరావు , తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ జిల్లా వాణిజ్య విభాగం అధికార ప్రతినిధి గా కె.ఎల్.వి సతీష్ కుమార్, తెలుగేదశం పార్టీ ఎన్టీఆర్ జిల్లా వాణిజ్య విభాగం కార్యదర్శిగా వెల్లంకొండ రాఘవేంద్ర నియమితులయ్యారు. ఈ మేరకు గురువారం విజయవాడ పార్లమెంట్ కార్యాలయం పత్రిక ప్రకటన విడుదల చేసింది. టిడిపి విజయవాడ పార్లమెంట్ అభ్యర్ధి కేశినేని శివనాథ్ ఈ నలుగుర్ని ఈ పదవుల్లో నియమించాల్సిందిగా సిఫార్స్ చేయటం జరిగింది ఈ మేరకు తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ జిల్లా విజయవాడ పార్లమెంట్ అధ్యక్షుడు నెట్టెం రఘురాం వారిని నియమిస్తూ ఉత్తర్వలు జారీ చేశారు. ఈ నియమాక పత్రాలను వీరంతా ఎన్టీఆర్ భవన్ లో నెట్టం రఘురాం, కేశినేని శివనాథ్ చేతుల మీదుగా అందుకున్నారు. నియమాక పత్రాలు అందుకున్న నాయకులకు అభినందనలు తెలియజేయటంతో పాటు పార్టీ గెలుపు, పార్టీ అభివృద్ది కోసం కృషి చేయాలని నెట్టం రఘురాం, కేశినేని శివనాథ్ కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వాణిజ్య విభాగం అధ్యక్షుడు డూండీ రాకేష్ పాల్గొన్నారు.