ఆర్థిక రంగంలో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (AI) సేవలు
వినియోగం కోసం 8 మందితో నిపుణుల కమిటీ: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఆర్థిక రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (FREE-AI) యొక్క సేవలను అభివృద్ధి చేయడానికి ఎనిమిది మంది సభ్యుల నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. ఐఐటీ బాంబే ప్రొఫెసర్ (కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ విభాగం) పుష్పక్ భట్టాచార్య నేతృత్వంలోని ఏర్పాటైన ఈ కమిటీ, ఆర్థిక రంగానికి బలమైన, సమగ్రమైన మరియు అనుకూలమైన ఫ్రేమ్వర్క్ను సిఫారసు చేస్తుంది. భారతదేశంలో ఆర్థిక సేవలలో Al యొక్క స్వీకరణ యొక్క ప్రస్తుత స్థాయిని కమిటీ అంచనా వేస్తుంది మరియు ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక రంగంపై దృష్టి సారించి Al పై నియంత్రణ మరియు పర్యవేక్షక విధానాలను సమీక్షిస్తుంది.