ఆరోగ్య భద్రతే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం
సీఎం సహాయ నిధి చెక్కుల పంపిణీ
భవానిపురం లోని ఎన్డీయే కార్యాలయంలో లబ్ధిదారులకు రూ 1 లక్షా 59 వేల విలువైన ముఖ్యమంత్రి సహాయనిది చెక్కులను ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ బుధవారం అందజేశారు.
పేదవాడి ఆరోగ్య భద్రతే లక్ష్యంగా కూటమి ప్ర
భుత్వం పనిచేస్తుందన్నారు.
ఇప్పటివరకు పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని బాధితులకు ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆదేశాలతో 56 మంది లబ్ధిదారులకు రూ 57,23,626 ల విలువైన సిఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశామని ప్రత్తిపాటి శ్రీధర్ తెలిపారు.
కూటమి నేతలు గుడివాడ నరేంద్ర రాఘవ , యేదుపాటి రామయ్య, వేంపలి గౌరి శంకర్ తదితరులు పాల్గొన్నారు.