Home Andhra Pradesh ఆపరేషన్ సిందూర్ లో వీర మరణం పొందిన అగ్నివీర్ సైనికుడు మురళీ నాయక్.

ఆపరేషన్ సిందూర్ లో వీర మరణం పొందిన అగ్నివీర్ సైనికుడు మురళీ నాయక్.

3
0

ఆపరేషన్ సిందూర్ లో వీర మరణం పొందిన అగ్నివీర్ సైనికుడు మురళీ నాయక్. సత్యసాయి జిల్లా చెందిన మురళీ నాయక్ కుటుంబాన్ని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పరామర్శించి రూ. 25 లక్షలు ఆర్థిక సాయం అందిస్తానని హామీ ఇచ్చారు. ఆ మేరకు శనివారం ఉదయం మురళీ నాయక్ తల్లితండ్రులకి పవన్ కళ్యాణ్ పంపించిన రూ. 25 లక్షల చెక్కును తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, పాలకొండ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ కల్లి తండాకు వెళ్ళి అందచేశారు. ఈ కార్యక్రమంలో అహుడ ఛైర్మన్ టి.సి.వరుణ్, జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథ రెడ్డి, జనసేన పార్టీ నేతలు పత్తి చంద్రశేఖర్, కాయగూరల లక్ష్మీపతి తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here