Home Political news ఆదివారం రాత్రి ఇంద్రకీలాద్రి మీడియా పాయింట్ వద్ద రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రివర్యులు ఆనం రామనారాయణరెడ్డి...

ఆదివారం రాత్రి ఇంద్రకీలాద్రి మీడియా పాయింట్ వద్ద రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రివర్యులు ఆనం రామనారాయణరెడ్డి మాట్లాడుతూ.

2
0

*ఇంద్రకీలాద్రి, అక్టోబర్ 06, 2024*

ఆదివారం రాత్రి ఇంద్రకీలాద్రి మీడియా పాయింట్ వద్ద రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రివర్యులు ఆనం రామనారాయణరెడ్డి మాట్లాడుతూ.

– 78 శాతం మేర భక్తులు అమ్మవారి దర్శనానికి సంబంధించి సంతృప్తి వ్యక్తం చేశారు. సంతృప్తి స్థాయి 100% నమోదయ్యేలా లోటుపాట్లను సరి చేస్తున్నాం. 

– క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులకు మంచినీటితో పాటు పాలు, మజ్జిగ అందిస్తున్నాం.

– ఆదివారం రాత్రి 8:30 గంటల వరకు చూస్తే శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి అలంకృత అమ్మవారిని 65,999 మంది భక్తులు దర్శించుకున్నారు. 

– ఆదివారం ఉదయం కట్టెపొంగలి, పులిహోరను 19 వేల మందికి అందించాం. 25 వేల మందికి అన్నదాన వితరణ చేయడం జరిగింది.

– గత నాలుగు రోజుల గణాంకాలను చూస్తే 9,59,000 వాటర్ ప్యాకెట్లను, నాలుగు లక్షల 90 వేల మంచినీటి బాటిల్స్ అందించాం.

– 45 వేల మందికి పాలు, 53 వేల మందికి మజ్జిగ పంపిణీ చేసాం. 

– రాష్ట్ర ప్రభుత్వం ధూపదీప నైవేద్యం పథకం కింద రూ. 50 వేల లోపు వార్షిక ఆదాయం ఉన్న ఆలయాలకు సంబంధించి ఇచ్చే మొత్తాన్ని ఐదువేల నుంచి పదివేలకు పెంచడం జరిగింది. ఈ మొత్తం 5,400 ఆలయాల అర్చకుల ఖాతాల్లో త్వరలో జమవుతుంది.

– దేవాలయాలకు సంబంధించి ప్రస్తుతం ఉన్న ట్రస్ట్ బోర్డు సభ్యులకు అదనంగా మరో ఇద్దరిని పెంచేందుకు చట్ట సవరణ చేయనున్నాం. ఇద్దరిలో ఒకరు బ్రాహ్మణులు కాగా మరొకరు నాయీ బ్రాహ్మణులు.

– *రాష్ట్రంలో దేవాదాయ శాఖ ప్రక్షాళనకు చర్యలు తీసుకుంటున్నాం. ఇందులో భాగంగా ఆలయాల్లో పాలకవర్గాలు, అధికారులు ఆగమ శాస్త్రానికి విరుద్ధంగా, ఆచార సంప్రదాయాలకు విరుద్ధంగా ఎవరూ నిర్ణయాలు తీసుకోకూడదని నిర్ణయించాం.

– కమిషనర్ మొదలు ఆర్ జె సి, డిప్యూటీ కమిషనర్లు, అసిస్టెంట్ కమిషనర్లు ఇలా ఏ ఒక్కరు జోక్యం చేసుకోకూడదని నిర్ణయించాం.

– ఉత్సవాలు, పూజా కార్యక్రమాలు నిర్వహణ, యాగాలు,  కుంభాభిషేకాలు వంటి వాటికి సంబంధించిన నిర్ణయాలను ఆగమశాస్త్ర పండితులు ద్వారా తీసుకోవాలని ఆదేశించడం జరిగింది. 

– అవసరమైతే వైదిక కమిటీలను ఏర్పాటు చేసుకోవాలని ఆదేశాలు ఇవ్వడం జరుగుతోంది. 

– ఈ వైదిక కమిటీల ద్వారా ఏకాభిప్రాయం సాధించాల్సి ఉంటుంది. ఒకవేళ ఏదైనా భేదాభిప్రాయం వచ్చినా ఆగమ పీఠాధిపతులను సంప్రదించి తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. 

– ఈవోలు ఆగమశాస్త్ర వ్యవహారాలు, సంప్రదాయాలు వంటివి పాటించేలా చూడాలే తప్ప నిత్య పూజలు, క్రతువులు  తదితరాలకు ముహూర్తాలను నిర్ణయించడంలో జోక్యం చేసుకోకూడదని కమిషనర్ ద్వారా ఆదేశాలు ఇవ్వడం జరుగుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here