Home Political news ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ 2025 అభివృద్ధికి దోహదం తెలుగు భాషకు ప్రత్యేక కేటాయింపు ప్రభుత్వ విప్...

ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ 2025 అభివృద్ధికి దోహదం తెలుగు భాషకు ప్రత్యేక కేటాయింపు ప్రభుత్వ విప్ యార్లగడ్డ

2
0

 ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ 2025 అభివృద్ధికి దోహదం  తెలుగు భాషకు ప్రత్యేక కేటాయింపు ప్రభుత్వ విప్ యార్లగడ్డ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 2025 ఆర్థిక సంవత్సరానికి గాను అత్యంత సమగ్రమైన బడ్జెట్‌ను ప్రవేశపెట్టిందని ప్రభుత్వ విప్, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావ్ తెలిపారు. 4 వ రోజు అసెంబ్లీలో సమావేశంలో బడ్జెట్ పై ఆయన ప్రసంగించారు. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ మొత్తం 3,23,359 కోట్ల రూపాయలతో బడ్జెట్ రూపొందించారని చెప్పారు.  

ప్రస్తుత ఆర్థిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని, అభివృద్ధికి మరింత ఊతమిచ్చేలా కేటాయింపులు చేసారని అన్నారు. గత కొన్నేళ్లుగా ఆర్థికంగా తీవ్ర సవాళ్లను ఎదుర్కొన్న రాష్ట్రానికి ఇది మెరుగైన బడ్జెట్‌గా నిలుస్తుందని తెలిపారు.

మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి పిట్టకథలు చెప్పడం మినహా బడ్జెట్ ద్వారా రాష్ట్రానికి మేలు కలిగించే ప్రయోజనాలు చేకూర్చలేదన్నారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేస్తున్న కృషిని ప్రస్తావిస్తూ…. “విపత్తులను అవకాశాలుగా మార్చుకునే నాయకత్వం ఈ బడ్జెట్‌లో స్పష్టంగా కనిపిస్తోంది” అని పేర్కొన్నారు.

తెలుగుబాషకు 10 కోట్ల కేటాయింపు హర్షణీయం

తెలుగు భాష అభివృద్ధికి రూ.10 కోట్ల కేటాయింపు చేయడం హర్షణీయమన్నారు. దేశ భాషలలో తెలుగు గొప్పతనాన్ని చాటేలా ఈ ప్రభుత్వం తెలుగు భాష కోసం నిర్ణయం తీసుకోవడం గొప్ప విషయమన్నారు.ఇటలీ యాత్రికుడు నికోలె డి కోంటే, మహాకవి శంకరాచార్య సుందరాచార్య, శ్రీకృష్ణదేవరాయలు వంటి మహనీయులు తెలుగును ప్రోత్సహించిన విషయాన్ని సభలో ప్రస్తావించారు

తెలుగు భాషపై వైసీపీ హయాంలో నిర్లక్ష్య వైఖరి కనిపించిందని, విద్యా వ్యవస్థలో తెలుగును తొలగించి ఇంగ్లీష్‌కి ప్రాధాన్యం ఇచ్చారని విమర్శించారు. అయితే, ఈసారి చంద్రబాబు నాయుడు పాలనలో మాతృభాషను ప్రోత్సహించేందుకు ప్రత్యేక కేటాయింపు జరగడం ప్రతి తెలుగువాడూ అభినందించాల్సిన విషయం అని తెలిపారు.

గ్రామీణాభివృద్ధి, విద్యా, బీసీ సంక్షేమానికి భారీ కేటాయింపులు

గ్రామ పంచాయతీ అభివృద్ధికి రూ.18,847 కోట్ల నిధులు కేటాయించడం పట్ల ప్రభుత్వానికి ఎమ్మెల్యే యార్లగడ్డ ధన్యవాదాలు తెలిపారు. గతంలో సర్పంచులు కోర్టుకు వెళ్లినా నిధులు రాకపోవడం వంటి సమస్యలు ఎదురవ్వగా, ప్రస్తుతం గ్రామ స్వరాజ్యాన్ని సాధించే దిశగా ఎన్డీయే ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అన్నారు. 

జగన్ ప్రభుత్వ అసమర్ధ పాలన వలన విద్యా రంగంలోనూ గత ప్రభుత్వ హయాంలో అనేక పాఠశాలలు మూతపడటం వల్ల వేలాది మంది విద్యార్థులు చదువును ఆపాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆరోపించారు. దీనిని సరిదిద్దేందుకు ప్రభుత్వం విద్యా శాఖకు రూ.31,805 కోట్ల బడ్జెట్ కేటాయించిందన్నారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని, విద్యా వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేసే దిశగా మంత్రి నారా లోకేష్ అడుగులు వేస్తున్నారని ప్రశంసించారు. 

అలాగే, బీసీ సంక్షేమానికి ప్రత్యేక ప్రాధాన్యతనిస్తూ, తగిన నిధులు కేటాయించడం హర్షనియమని అన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం బీసీల ప్రభుత్వమని పేర్కొన్నారు. అలాగే, చేనేతవృద్ధి అభివృద్ధి కోసం రూ. 20 కోట్లు కేటాయించడం హర్షించదగ్గ విషయమన్నారు. 

స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత అత్యంత తక్కువ అభివృద్ధి చేసిన ప్రభుత్వం వైసీపీ అని విమర్శించారు. గత ప్రభుత్వ చేసిన పనికి గుంతలు లేని ఆంధ్రప్రదేశ్ కార్యక్రమం చేపట్టాల్సి వచిందన్నారు. ఈ కార్యక్రమం ద్వారా రోడ్ల పూడ్చడం, మరమ్మతులు చేస్తున్నామని వివరించారు. 

పారిశ్రామిక రంగంలోనూ వైసీపీ హయాంలో పెద్ద కంపెనీలు పెట్టుబడులకు వెనుకంజ వేసినట్లు ఆరోపించారు. తన నియోజకవర్గంలోనే అశోల్ లే ల్యాండ్ కంపెనీ వెనక్కి వెళ్లిపోయిందన్నారు. పెట్టుబడిదారులు ముందుకు రావడానికి ఆసక్తి చూపలేదని, అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆధ్వర్యంలోని ఎన్డీయే ప్రభుత్వం పారిశ్రామిక అభివృద్ధి పెద్ద పీట వేస్తుందని చెప్పారు..

రైతాంగాన్ని వైసీపీ ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శించారు. నీటి సరఫరా సకాలంలో అందకపోవడం, ఖరీఫ్, రబీ పంటలకు గిట్టుబాటు ధరలు లేకపోవడం, 2024లో ధాన్యం కొనుగోలు చేయక 60 లక్షల మంది రైతులను తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టడం వంటి పరిస్థితులు నెలకొన్నాయని విమర్శించారు.

ఆంధ్రప్రదేశ్‌లో జిల్లాల పునర్విభజన పై విమర్శలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన జిల్లాల పునర్విభజన గత ముఖ్యమంత్రి జగన్ అనుభవ రాహిత్యంతో ప్రజలకు తీవ్ర ఇబ్బందులను కలిగించిందని విమర్శించారు. పునర్విభజనలో తన నియోజకవర్గం రెండు జిల్లాలలో ఉందని.. ప్రజల అవసరాలను గణనలోకి తీసుకోకుండా నిర్ణయాలు తీసుకున్నారని మండిపడ్డారు.

కృష్ణా జిల్లాలో విజయవాడ నుంచి గన్నవరం 19 కిలోమీటర్లు కాగా, గన్నవరం నుంచి మచిలిపట్నం 64 కిలోమీటర్లు దూరంగా ఉందని అలాగే, పెనమలూరు నుంచి విజయవాడ 9 కిలోమీటర్ల దూరంలో ఉంటే, మచిలిపట్నం 60 కిలోమీటర్ల దూరంలో ఉందని వీటి వలన ప్రజలకు ప్రభుత్వ కార్యాలయాలు, రెవెన్యూ డివిజన్ కేంద్రాలు మరింత దూరంగా మారాయని తెలిపారు.

ప్రజలకు అత్యవసరమైన ప్రభుత్వ కార్యాలయాలు, పోలీస్ కమిషనరేట్, ఎస్పీ కార్యాలయాల దూరం పెరిగిన పరిస్థితిని ప్రభుత్వమే సరిచేయాల్సిన అవసరం ఉందని అన్నారు. గన్నవరం ఎయిర్‌పోర్ట్ విజయవాడకు 16 కిలోమీటర్ల దూరంలో ఉంటే, మచిలిపట్నం ఎస్పీ కార్యాలయం 60 కిలోమీటర్ల దూరంలో ఉండడం ప్రజలకు ఇబ్బంది అని పేర్కొన్నారు.

అలాగే, కొత్త జిల్లాల్లో అన్ని శాఖలకు అవసరమైన ముఖ్య కార్యాలయాలు ఇంకా ఏర్పాటు కాలేదని తెలిపారు. 

తన అనుభవాన్ని భాగస్వామ్యం చేస్తూ, కేడిసీసీ బ్యాంకు చైర్మన్‌గా ఉన్న సమయంలో రూ. 5,200 కోట్ల టర్నోవర్‌ను రూ. 8,000 కోట్లకు పెంచినట్లు, అలాగే 1,000 మందికి ప్రభుత్వ ఉద్యోగాలు, మరో 1,000 మందికి ఇంటర్న్‌షిప్ ఇచ్చినట్లు పేర్కొన్నారు. దేశంలోనే నెంబర్ వన్ బ్యాంక్ గా చేస్తే తనను చైర్మన్గా తొలగించారని గుర్తు చేశారు

జగన్ ప్రతిపక్ష హోదా కోరడం పై ఆగ్రహం

ఎన్నికలకు ముందు జగన్ కు ప్రతిపక్ష హోదా రాదని ముందే చెప్పానని అన్నట్లుగానే ప్రజలు జగన్కు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు వ్యాఖ్యానించారు. గత వైసీపీ మంత్రులు అసెంబ్లీ లో బూతులు మాట్లాడి సభను అగౌరవ పరిచారని మండిపడ్డారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని ధ్వజమెత్తారు..భారత స్వాతంత్ర్యం తర్వాత రాజ వంశాలకు చెందిన వారే మంత్రులుగా వ్యవహరించిన సందర్భాలను ప్రస్తావించారు. మద్రాస్ రాష్ట్రంలో ఆరోగ్య శాఖ మంత్రిగా రాజవంశానికి చెందిన వారు పని చేసినట్టుగా, రాజులు కూడా ప్రజాస్వామ్యంలో సేవలందించినట్లు గుర్తు చేశారు.

కానీ జగన్ రెడ్డి మాత్రం అసెంబ్లీ నాలుగో గేట్ నుండి రానని రెండో గేటు నుండి పంపితేనే వస్తానని అసెంబ్లీకి డుమ్మా కొట్టారని ఎద్దేవా చేశారు. ప్రజా వేదిక ద్వారా ప్రజల నుండి అర్జీలు స్వీకరిస్తారని ఆ అర్జీలు ఏమి చేస్తారో ఆయన సొంత నిధులు ఇస్తారో తెలియదని ఎద్దేవా చేశారు. 

ఎపి స్టాంప్స్ & రిజిస్ట్రేషన్ డిపార్టుమెంటు కి సూచనలు

బ్రిటిష్ ఇండియా 1899 రిజిస్ట్రేషన్ యాక్ట్ కు బదులుగా, నూతన A.P రిజిస్ట్రేషన్ యాక్ట్ తీసుకువస్తే రాష్ట్ర ఖజానా కు 1000 కోట్లు ఆదాయం వచ్చే అవకాశం ఉందని యార్లగడ్డ పేర్కొన్నారు. మన అసెంబ్లీ లో బిల్ పాస్ చేసుకొని, పార్లమెంట్ మరియు రాష్ట్రపతి ఆమోదంతో ఇది సాధ్యం చెయ్యవచ్చన్నారు. రాజస్థాన్, గుజరాత్, వెస్ట్ బెంగాల్ & మహారాష్ట్ర వారి సొంత స్టాంప్స్ & రిజిస్ట్రేషన్ యాక్ట్ ని అమలు ని చేస్తున్నాయన్నారు. ఈ రాష్ట్రాల యాక్ట్స్ ని క్షుణ్ణంగా అధ్యయనం చెయ్యాల్సింది గా చేయాలని స్టాంప్స్ & రిజిస్ట్రేషన్ డిపార్టుమెంటు ను కోరారు

జిఓ 90 అమలు చేయాలి

PACS సెక్రెటరీల పదవి కాలం మొత్తం వారు జాయిన్ అయిన ఊర్లోనే రిటైర్ అవుతున్న పరిస్థితి ఉందని ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావ్ పేర్కొన్నారు. వారు సర్వీస్ మొత్తం దాదాపు 35 సం..లు ఒకే బ్యాంకు నందు పనిచేస్తూ కొంతమంది అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఆరోపించారు. PACS సెక్రటరీలకు ట్రాన్స్ఫర్స్ లేక పోవడం అనేది చాలా దారుణమన్నారు.. ఆ ఊర్లో బ్యాంకు ప్రెసిడెంట్ చదువుకోని వాళ్ళు అయితే, వీరే పెత్తనం చేస్తున్నారని వాళ్లకి ట్రాన్స్ఫర్స్ కచ్చితంగా ఉండాల్సిందే అని నేను ప్రభుత్వం నుంచి PACS సెక్రటరీల ట్రాన్స్ఫర్స్ కి సంబంధించి కష్టపడి ఒప్పించి HR పాలసీ రెడీ చేసి ఇచ్చి జీవో నెం: 90 తీసుకొచ్చనన్నారు.. కాని జీవో నెం: 90 అమలకు మాత్రం నోచుకోలేదనిఈ జీవో 90 ని అమలు చేస్తే ఈ పిఎసిఎస్ సెక్రెటరీల వ్యవస్థ లో ప్రక్షాళన జరుగుతుందన్నారు.

తెలంగాణ అసెంబ్లీ సందర్శనకు ఎమ్మెల్యే యార్లగడ్డ విజ్ఞప్తి

 గన్నవరం నియోజకవర్గ ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావ్ తన చిన్ననాటి కలను నెరవేర్చుకున్న సందర్భంగా భావోద్వేగంగా స్పందించారు. అసెంబ్లీకి హాజరయ్యే కోరిక తన 9వ తరగతి నుంచి ఉండేదని తెలిపారు. ఈ కోరికను గన్నవరం ప్రజలు నెరవేర్చారని ఆయన పేర్కొన్నారు. “నన్ను ఎమ్మెల్యేగా గెలిపించిన ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడానికి కృషి చేస్తున్నాను,” అని ఆయన అన్నారు. చిన్ననాటి రోజుల్లో హైదరాబాద్ అసెంబ్లీనే తనకు గుర్తు వస్తుందని రాష్ట్ర విభజన అనంతరం ఆ కల ఇక్కడ నెరవేరింది,” అని ఎమ్మెల్యే యార్లగడ్డ పేర్కొన్నారు. తెలంగాణ అసెంబ్లీని సందర్శించే అవకాశం కల్పించాలనని స్పీకర్, ముఖ్యమంత్రిని యార్లగడ్డ కోరారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here