31.07.2025.
నెల్లూరు.
ఆంధ్రప్రదేశ్లో ఎమర్జెన్సీ పరిస్థితులు
యథేచ్ఛగా రెడ్బుక్ రాజ్యాంగం అమలు
వైయస్ జగన్ ఫైర్
నెల్లూరులో పర్యటించిన మాజీ ముఖ్యమంత్రి, వైయస్సార్సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్రెడ్డి, అక్కడ జైల్లో ఉన్న మాజీ మంత్రి కాకాణి గోవర్థన్రెడ్డితో పాటు, నగరంలోనే ఉన్న ఉన్న మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్రెడ్డిని పరామర్శించారు.
నా పర్యటనపై ఎందుకిన్ని విధాలుగా ఆంక్షలు?
నా పార్టీ వారిని నేను కలవడం తప్పా? నేరమా?
వేల సంఖ్యలో పోలీసులు. ఎక్కడిక్కడ బారికేడ్లు
నడిచి రాకుండా అడ్డంకులు. రోడ్లూ తవ్వేశారు
ఇంత అధ్వాన్న పరిస్థితి ఎక్కడా ఉండబోదు
ఒక్క చంద్రబాబునాయుడి ప్రభుత్వంలో తప్ప
అసలు నన్ను చూసి ఎందుకంత భయపడుతున్నారు?
:ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించిన వైయస్ జగన్
చంద్రబాబు ప్రభుత్వం మీద తీవ్ర ప్రజావ్యతిరేకత
చంద్రబాబు తన పాలన చూసి తానే భయపడుతున్నాడు
అందుకే ఎవరూ ప్రశ్నించకూడదని అనుకుంటున్నాడు
ఆ దిశలోనే ప్రశ్నించే గొంతులు నొక్కుతున్నారు
ఈ చర్యలన్నీ ఆ విషయాలనే స్పష్టంగా చూపుతున్నాయి
:తేల్చి చెప్పిన వైయస్ జగన్
మాజీ మంత్రి కాకాణి గోవర్థన్రెడ్డిపై 14 కేసులు
ఒక దాంట్లో బెయిల్ వస్తే మరో కేసు పెడుతున్నారు
అడ్డగోలుగా కేసుల నమోదు. అంతా అన్యాయం
ప్రజాస్వామ్యంలో రాజకీయంగా స్టేట్మెంట్స్ కామన్
ఎవరైనా అనుచితంగా మాట్లాడారనుకుంటే ఖండించవచ్చు
కానీ ఏకంగా ఇంటిపై దాడి చేసి విధ్వంసం సృష్టిస్తారా?
నల్లపురెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి ఇంటిపై దాడి హేయం
ఇల్లంతా విధ్వంసం. కారునూ బోల్తా కొట్టించారు
ఏకంగా 80 మంది కర్రలు, రాడ్లతో ఇంటిపై పడ్డారు
ప్రసన్న అప్పుడు ఇంట్లో ఉండి ఉంటే చంపేసే వాళ్ళు
వైయస్ జగన్ వెల్లడి
రాష్ట్రంలో చంద్రబాబు విషబీజాలు నాటుతున్నారు
అవే రేపు వృక్షాలవుతాయి. అప్పుడు ఇదే కొనసాగుతుంది
ఇది ఒక తప్పుడు సంప్రదాయం
దీన్ని చంద్రబాబునాయుడు ఇప్పటికైనా గుర్తించాలి
:శ్రీ వైయస్ జగన్ స్పష్టీకరణ
వైయస్సార్సీపీని ఇబ్బంది పెట్టడమే ప్రభుత్వ లక్ష్యం
అందుకే నాయకులపై అక్రమ కేసులు. అరెస్టులు
ఎల్లకాలం మీ ప్రభుత్వమే ఉండదు. ఉండబోదు
ఇప్పటి మీ చర్యలకు రేపు రెండింతలతో బదులు
ఇప్పటికైనా చంద్రబాబు తన వైఖరి మార్చుకోవాలి
వేధిస్తున్న అధికారుల పద్ధతి కూడా మారాలి
తప్పుడు పనులు చేసిన వారెవ్వరినీ వదలిపెట్టం
ఎక్కడ ఉన్నా తీసుకొస్తాం. చట్టం ముందు నిలబెడతాం
వైయస్ జగన్ హెచ్చరిక
నెల్లూరు:
రాష్ట్రంలో ఇప్పుడు రెడ్బుక్ రాజ్యాంగాన్ని యథేచ్ఛగా అమలు చేస్తున్నారని, దాని వల్ల ఎమర్జెన్సీ పరిస్థితులు కనిపిస్తున్నాయని మాజీ ముఖ్యమంత్రి, వైయస్సార్సీపీ అ««ధ్యక్షుడు వైయస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రంలో చంద్రబాబునాయుడు ఇప్పుడు విషబీజాలు నాటుతున్నారన్న ఆయన, అవే రేపు వృక్షాలవుతాయని, అప్పుడు సరిగ్గా ఇదే కొనసాగుతుందని వెల్లడించారు. ఇది ఒక తప్పుడు సంప్రదాయం అని, దీన్ని చంద్రబాబునాయుడు ఇప్పటికైనా గుర్తించాలని అన్నారు.
నెల్లూరులో పర్యటించిన మాజీ ముఖ్యమంత్రి, వైయస్సార్సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్రెడ్డి, అక్కడ జైల్లో ఉన్న మాజీ మంత్రి కాకాణి గోవర్థన్రెడ్డిని పరామర్శించారు. ఆ తర్వాత నగరంలోనే ఉన్న మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి ఇంటికి వెళ్లి, ఆ కుటుంబాన్ని కూడా పరామర్శించారు. వారి ఇంటిపై జరిగిన దారుణ దాడి వివరాలు తెలుసుకున్న ఆయన, ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ, ప్రభుత్వ వైఖరిని ఎండగట్టారు.
నెల్లూరులో మీడియాతో మాట్లాడిన వైయస్ జగన్ ఏమన్నారంటే
నా పార్టీ వారిని కలవడం తప్పా?:
రెడ్ బుక్ రాజ్యాంగంతో ఈరోజు రాష్ట్రంలో ఎమర్జెన్సీ పరిస్థితులు నెలకొన్నాయి. రాష్ట్రంలో జరుగుతున్న అనేక ఘటనలు ఎమర్జెన్సీ పరిస్థితిని కంటికి కనిపించేలా చేస్తున్నాయి. చంద్రబాబును, ఆయన అడుగులకు మడుగులు ఒత్తే పోలీసులను అడుగుతున్నాను. నా పర్యటనలో ఎందుకీ ఆంక్షలు పెట్టారు? ఒక రాజకీయ నాయకుడు తమ పార్టీకి సంబంధించిన వారిని కలవడం నేరమా? అలా కలవడం తప్పా? ఎందుకు ఆంక్షలు విధిస్తున్నారు? నా కార్యక్రమానికి నన్ను అభిమానించే వారొస్తే తప్పేమిటి? వాళ్లను రానివ్వకుండా ఏకంగా రోడ్లన్నీ తవ్వారు. సందుల నుంచి టూవీలర్లు కూడా రాకుండా ఏకంగా రోడ్లు తవ్వేశారు. ఇంత అధ్వాన్నమైన పరిస్థితి బహుషా ప్రపంచ చరిత్రలో ఏ రాజకీయ పార్టీకి ఉండదేమో! ఒక్క చంద్రబాబునాయుడికి తప్ప.
ప్రజా వ్యతిరేకతతో భయపడుతున్న చంద్రబాబు:
నిజంగా ఒక ప్రతిపక్ష నాయకుడిని చూíసి ఇంతగా భయపడుతున్నందుకు చంద్రబాబు ఒక బావి చూసి దూకాలి.
నిజంగా ఒక ప్రతిపక్ష నాయకుడిని చూసి, ఇంతగా భయపడి, ఆయన వస్తుంటే అభిమానులను ఆపడం కోసం, ప్రజలను ఆపడం కోసం రోడ్లను తవ్విన చరిత్ర ఒక్క చంద్రబాబునాయుడికి దక్కుతుంది.
ఈరోజు 2 వేలకు పైగా పోలీసులు. లెక్కలేనంత మంది డీఎస్పీలు. డీఐజీ కూడా ఇక్కడే తిష్ట వేశాడట. వారంతా నా సెక్యూరిటీ కోసం కాదు. నా అభిమానులను ఆపడం కోసం వారంతా పని చేస్తున్నారు.
చంద్రబాబు ప్రభుత్వం మీద ఎంతో ప్రజా వ్యతిరేకత ఉంది. అందుకే చంద్రబాబు తన పాలన చూసి తానే భయపడుతున్నాడు అని చెప్పడానికి ఇంతకన్నా వేరే చెప్పాల్సిన నిదర్శనాలు అవసరం లేదు.
ఎవరైనా బ్రహ్మాండమైన పాలన అందించి, ప్రజల మన్ననలు పొంది, దాని ద్వారా వచ్చే ఆశీస్సులు చూడాలి. కానీ, ఇక్కడ పాలన మొదలైనప్పటి నుంచి అన్నీ అబద్ధాలే. సూపర్ సిక్స్లు, సూపర్ సెవెన్లు అంటూ ప్రజలను వెన్నుపోటు పొడిచారు. పాలనంతా అబద్దాలు మోసాలు.
గొంతు నొక్కేందుకే రెడ్బుక్:
వ్యవస్థలన్నీ నీరుగారిపోయాయి. స్కూళ్లు నాశనం అయిపోయాయి. విద్యాదీవెన, వసతి దీవెన లేదు. ఆరు క్వార్టర్లు విద్యాదీవెన పెండింగ్. ఫీజులు అందడం లేదు. దాంతో పిల్లలు చదువులు మానేస్తున్నారు.
నాడు–నేడు ఆగిపోయింది. గోరుముద్ద అన్నది రోజుకొక మెనూతో పిల్లలకు మంచి పౌష్టికాహారం ఆనాడు ఇవ్వగా, ఈరోజు స్కూళ్లలో తిండి తినడానికి పిల్లలు భయపడుతున్నారు. ఇంగ్లిష్ మీడియమ్ ఆగిపోయింది. టోఫెల్ క్లాసులు ఎత్తేశారు. ఆరోగ్యశ్రీ సేవలు నిల్చిపోయాయి. నెలకు రూ.300 కోట్లు కావాలి. దాదాపు రూ.4200 కోట్లు బకాయి పెట్టాడు. ఆరోగ్య ఆసరా లేనే లేదు. ఆరోగ్యశ్రీ కింద ఆస్పత్రులు వైద్య సేవలు అందించడం లేదు.
ఏ పంటకూ గిట్టుబాటు ధర లేదు. ఉచిత పంటల బీమా లేదు. రైతులకు పెట్టుబడి సాయం లేదు. వారికి రైతు భరోసా అందడం లేదు. దాన్ని చంద్రబాబు ఖూనీ చేశారు. చంద్రబాబు పాలనలో రైతులకు ఆత్మహత్యలే శరణ్యం అన్నట్లుగా వ్యవసాయం మారింది. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా దిగజారిపోయింది. రెడ్బుక్ రాజ్యాంగం అమలు అవుతోంది. సూపర్ సిక్స్లు, సూపర్ సెవెన్లూ మోసాలయ్యాయి. జగన్ పథకాలన్నీ రదై్ద పేదల బతుకులు అల్లాడుతున్నాయి.
దీంతో ప్రజలకు చంద్రబాబు సమాధానం చెప్పుకోలేక, వారు ప్రశ్నిస్తే ఆ గొంతును నొక్కడానికి చంద్రబాబు చేస్తున్న ప్రయత్నమే ఈ రెడ్బుక్ రాజ్యాంగం.
అందుకు ఈ రెండు ఉదంతాలు ఉదాహరణ:
చంద్రబాబు ఎంతగా దిగజారిపోయాడు అని చెప్పడానికి నెల్లూరులో జరిగిన రెండు ఉదంతాలు చెబుతాను. నా పక్కన ప్రసన్న అన్న (నల్లపురెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి) ఉన్నాడు. ఆయన ఆరుసార్లు ఎమ్మెల్యే. అలాంటి ప్రసన్న అన్నను. గతంలో ఎప్పుడూ అలా జరగలేదు. రాష్ట్రంలో ఎవరైనా ప్రెస్ స్టేట్మెంట్లు ఇస్తారు. అటు, ఇటు రెండువైపులా ఇస్తారు. ఎవరైనా అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేస్తే, ఇటు వైపు ఉన్న వారు విమర్శిస్తారు. ప్రజాస్వామ్యంలో అది ఎప్పుడూ చూస్తాం.
కానీ, గతంలో ఏనాడూ జరగని విధంగా, మనుషులను చంపడానికి ఏకంగా 80 మందిని ఇంటి మీదకు పంపించారు. వారు తాగి ఉండి రాడ్లతోనూ, కర్రలతోనూ దాడి చేశారు. కారును తిప్పి పడేశారు. ఇంట్లో మొత్తం «ధ్వంసం చేశారు. ఇంటిని మొత్తం నాశనం చేశారు. ఇంట్లో ప్రసన్న అమ్మ 83 ఏళ్ల ఆమె ఉంది. ఆమె మహిళ కాదా? ఆవిడను బెదిరించారు. ఆ సమయంలో ప్రసన్న ఇంట్లో ఉండి ఉంటే, ఆయన్ను చంపేసి ఉండేవారు. ఇలాంటి దిగజారిపోయిన రాజకీయాలు గతంలో ఎప్పుడూ చూడలేదు.
ఆ పని మేము కూడా చేస్తే..:
నేను అడగుతున్నాను. మీ మంత్రులు, ఎమ్మెల్యేల ఇళ్లకు ఈ మాదిరిగానే మా వాళ్లను కూడా పంపించి దాడి చేయించే కార్యక్రమం మొదలుపెడితే రేపు పొద్దున రాజ్యాంగం బతుకుతుందా? రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉంటుందా?.
చంద్రబాబు నీవు చేస్తున్న పనులకు, నీవు వేస్తున్న బీజాలకు సిగ్గుతో తల దించుకోవాలి. ప్రజాస్వామ్యానికి విలువ ఇవ్వాలి. ప్రజాస్వామ్యంలో ఇటువైపు, అటువైపు స్టేట్మెంట్లు ఇచ్చుకోవచ్చు. అవి నచ్చకపోతే, ఇళ్లకు మనుషులను పంపించి చంపేసే కార్యక్రమం చేయడం అత్యంత హేయం అని చంద్రబాబుకు చెబుతున్నా.
మరో ఉదాహరణ. చిత్ర విచిత్రమైన కేసులు:
నా పక్కనే ఉన్న గోవర్థన్ అన్న కూతురు. ఏం తప్పు చేశాడని గోవర్థన్ అన్నను జైల్లో పెట్టారు. ఆయనపై ఏకంగా 14 కేసులు పెట్టారు. ఒక కేసు అయిపోగానే మరోకేసు పెడుతున్నారు. ఆయనను 64 రోజులుగా జైల్లో ఉంచారు. ఆయన మీద ఎంత అన్యాయమైన కేసులు పెట్టారో ఒక్కసారి చూడండి.
ఆయన ఇక్కడ పార్టీ ఆఫీసులో ప్రెస్మీట్ పెట్డాడు. ఆయన ఐటెమ్ మీడియాలో వస్తే, దాన్ని వాట్సప్లో ఫార్వర్ట్ చేస్తే, అది కేసు. టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డికి వ్యతిరేకంగా ప్రెస్మీట్ పెడితే, దానికి సంబంధించిన వీడియోను ఫార్వర్డ్ చేశాడని మరో కేసు పెట్టారు.
తెలుగుదేశం పార్టీ ఉచిత ఇసుక అని చెప్పింది. కానీ, ఉచితంగా ఎక్కడిస్తున్నారు? మా ప్రభుత్వ ఆదాయంలో ప్రభుత్వానికి రూ.750 కోట్ల ఆదాయం వచ్చేది. ఇప్పుడు ప్రభుత్వానికి ఆదాయం లేదు. మరోవైపు ఉచిత ఇసుక ఇవ్వడం లేదు. ఇసుక దొరక్క భవన నిర్మాణ కార్మికులు ఆందోళన చేస్తే, దానికి గోవర్థన్ అన్న సంఘీభావం చెప్పారని మరో కేసు పెట్టారు. ఎంత దారుణం?
వెంకటాచలం మాజీ జడ్పీటీసీ శేషయ్య అన్న మీద అక్రమంగా కేసు పెట్టి, జైలుకు పంపితే, దాన్ని నిరసిస్తూ, గోవర్థన్ అన్న ప్రెస్మీట్ పెట్టి మాట్లాడితే, పోలీసులకు వ్యతిరేకంగా మాట్లాడాడని కేసు పెట్టారు. ఇది ఇంకా ఎంత దారుణం. కావలి నియోజవర్గం, కొలదిన్నెలో మా పార్టీ కార్యకర్తలపై తెలుగుదేశం పార్టీ వారు దాడులు చేస్తే, బాధితులను పరామర్శించి, పోలీసుల పక్షపాత వైఖరికి తాను ఎండగడితే దానిపైనా కేసు పెట్టారు.
రాజకీయ పార్టీకి సంబంధించిన, తన మనుషుల మీద తెలుగుదేశం పార్టీ వారు దాడి చేస్తే, పోలీసులు అక్కడ పక్షపాతం చూపితే, దాన్ని ఎత్తిచూపితే కేసు పెట్టారు. ఇంకా మరో కేసు వింటే ఆశ్చర్యం కలుగుతుంది.
2024 ఎన్నికల సమయంలో లిక్కర్ పంచారని కేసు పెట్టారు. నిజానికి అప్పుడు ఎన్నికల సంఘం పర్యవేక్షణలో రాష్ట్రం ఉంది. వారి ఆ«ధ్వర్యంలో పరిపాలన సాగుతోంది. అప్పుడు పెట్టిన కేసుకు సంబంధించి, చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక, దర్యాప్తు పూర్తి చేసి, ఛార్జ్షీట్ కూడా వేశారు. ఏడాది తర్వాత తప్పుడు వాంగ్మూలాలతో మళ్లీ ఛార్జ్షీట్ లోకి వెళ్లి, గోవర్థన్రెడ్డిని ఇరికిస్తున్నారు. ఎంత దారుణం. ఇది ప్రజాస్వామ్యమేనా? మనం ప్రజాస్వామ్యంలోనే ఉన్నామా?
మరో కేసు. అక్రమంగా క్వార్ట్›్జ తవ్వకాలు జరిపారని కేసు పెట్టారు. ఆయన ఒక మంత్రిగా పని చేశారు. ఆ కేసులో పస లేదని కోర్టు నిర్ధారించి, ఆ కేసులో ఏ–1, ఏ–2, ఏ–3కి ముందస్తు బెయిల్ ఇచ్చారు. ఆ కేసులో గోవర్థన్ అన్న ఏ–4. కానీ ఆయనకు ముందస్తు బెయిల్ ఇవ్వకుండా జైల్లో పెట్టారు. ఈ కేసులో ప్రభుత్వం ఇచ్చిన విజిలెన్స్ రిపోర్ట్ చూస్తే.. అందులో ఇక్కడ తాటిపర్తి అనే గ్రామంలో ఎలాంటి క్వారీ తవ్వకాలు గడచిన నాలుగేళ్లుగా జరగడం లేదని వీఆర్వో సిద్ధం పుల్లయ్య చెప్పాడని ఆ రిపోర్టులో రాశారు. దాంతో ఆ కేసులో పస లేదని, ఏకంగా ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టారు. మైనింగ్లో ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టారు.
చంద్రబాబునాయుడిలో శాడిజమ్ అనేది ఏ స్థాయిలో ఉందని చెప్పడానికి ఇవన్నీ నిదర్శనాలు.
మరో కేసు.. మాగుంట శ్రీనివాస్రెడ్డి అనే ఎంపీ. ఆయనకు తెలియకుండా ఎవరో ఫోర్జరీ సంతకాలు పెట్టి, చట్టవిరుద్ధంగా మైనింగ్ చేశాడని, మా ప్రభుత్వ హయాంలోనే కేసు పెట్టి, ఎఫ్ఐఆర్ చేశాం. ఆ ఫోర్జరీ చేసిన వ్యక్తి చవ్వా చంద్రబాబునాయుడు. ఆయన టీడీపీకి చెందిన వ్యక్తి. కానీ ఆయన మీద కేసు పెట్టకుండా, కాకాణ గోవర్థన్రెడ్దిని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అప్పుడు మేము పెట్టిన కేసుకు సంబం«ధించి, వీరు వచ్చాక విజిలెన్స్ ఎంక్వైరీ చేసి, చవ్వా చంద్రబాబునాయుడిపై కేసు పెట్టకుండా, ఆయన సాక్ష్యంతో కాకాణి గోవర్థన్రెడ్డి మీద కేసు పెట్టడం ఏమిటి? ఎంత దారుణమో చూడండి.
గోవర్థన్రెడ్డి అన్న ఇల్లు. రూ.100 కోట్ల రాజభవనం అని తప్పుడు ఆరోపణ చేశారు. మరి అదే ఈ ప్రభుత్వంలో ఇచ్చిన విజిలెన్స్ రిపోర్టులో చూస్తే.. ఆ ఇంటి విలువ రూ.6 కోట్ల నుంచి రూ.7 కోట్ల వరకు ఉంటుంది. అయినా ఆయన ఇంటి విలువ రూ.100 కోట్లు అని ఒక తప్పుడు ఆరోపణ చేయడం ధర్మమేనా? ఇలాంటివి మొత్తం 14 కేసులు పెట్టారు. ఒక కేసులో బెయిల్ వచ్చే సమయానికి మరో కేసు పెడుతున్నారు.
చంద్రబాబూ.. వీటికేం చెబుతారు?:
అయ్యా, చంద్రబాబుగారు మీ ఎమ్మెల్యేలే ఎంత హేయంగా మాట్లాడారో చూడండి. నిన్న గాక మొన్న మీ నగరి ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే రోజా గురించి ఎంత హేయంగా మాట్లాడారు? ఎంత నీచంగా మాట్లాడారు. చెప్పడానికి సిగ్గు పడేలా మాట్లాడితే, చంద్రబాబు ఏం చేశారు?.
మొన్న కృష్ణా జడ్పీ ఛైర్మన్ ఉప్పాల హారిక కారుపై ఎంత దారుణంగా దాడి చేశారు? కారులో ఆమె, తన భర్త ఉండగానే, వారిని తిడుతూ, దాడి చేయడంపై ఏమంటారు? కారు అద్దాలు పగలగొట్టారు. కర్రలతో దాడి చేసి, దుర్భాషలాడారు. అన్యాయంగా తిట్టారు. దానికి మీ డిక్షనరీలో అర్థం ఏమిటి?. ఇంకా మా మాజీ మంత్రి రజనిపై ఎంత దారుణంగా మాట్లాడారు. దానికి ఏం చెబుతారు?.
అంతులేని అవినీతి. ఎక్కడికక్కడ దోపిడి:
రాష్ట్రంలో అవినీతి ఏ స్థాయిలో జరుగుతుందో అందరికీ తెలుసు.
లిక్కర్ మాఫియా. ఎక్కడ చూసినా, ఆ ప్రాంత ఎమ్మెల్యేలే అందులో ఉంటున్నారు. వారే అక్కడ లిక్కర్ మాఫియా బాస్గా ఉన్నారు. వేలం పాట పాడి మరీ బెల్టుషాప్లు కేటాయిస్తున్నారు. అక్కడ ఎమ్మార్పీ కంటే ఎక్కువ ధరకు అమ్ముతున్నారు. ఇల్లీగల్ పర్మిట్ రూమ్లతో లిక్కర్ అమ్ముతున్నారు. డీఐజీ ఆధ్వర్యంలోడీఎస్పీలు, డీఎస్పీల ఆధ్వర్యంలో సీఐలు.. ఇలా లంచాలు తీసుకొని ఎమ్మెల్యేలకు, చంద్రబాబుకు ఇంత అంటూ పంచుకుంటున్నారు.
రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో చూసినా కూడా ఇసుక యధేచ్చగా దోచుకుంటున్నారు. ఇదే నెల్లూరు జిలాలో సిలికా, క్వార్జ్ య«థేచ్చగా దోచుకుంటున్నారు. ఇక్కడ లోకల్ లీడర్ వీపీఆర్ (వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి) ద్వారానే సిలికా అమ్మాలంట! ఎవరికీ కూడా మైనింగ్ పర్మిట్ ఇవ్వడం లేదు. ఇందులో నారా లోకేష్, చంద్రబాబుకు వీపీఆర్ లంచాలు పంపిస్తున్నాడు. ప్రతి మైన్స్లో కూడా ఎమ్మెల్యేను కలవాలి. కొంత పోలీసులకు ఇవ్వాలి.
ఏ నియోజకవర్గంలో చూసినా విచ్చలవిడిగా పేకాటక్లబ్లు నడుపుతున్నారు. వెస్ట్ గోదావరి జిల్లాల్లో అయితే పేకాట క్లబ్లకే కోటి రూపాయలు ఇస్తున్నారు. నియోజకవర్గంలో ఏ పరిశ్రమ ఉన్నా కూడా ఎమ్మెల్యేకు, పోలీసులకు ఇంత డబ్బు ఇవ్వాల్సిందే. లేదంటే ఎమ్మెల్యే మనుషులను పంపించి పరిశ్రమల ప్రొడక్షన్ ఆపేస్తున్నారు. రాష్ట్రంలో ఈ స్థాయిలో అవినీతి జరుగుతున్నా ఎవ్వరూ మాట్లాడకూడదు. ఇంకా విచ్చలవిడిగా భూములను పప్పు బెల్లాలకు అమ్మినట్లు.. ఏకంగా 30 ఏళ్లు, 40 ఏళ్లు కాంట్రాక్ట్ అంటూ రూపాయికే ఎకరం పొలం కట్టబెడుతున్నారు. మరోవైపు సూపర్ సిక్స్, సూపర్సెవెన్ గాలికి వెగిరిపోయాయి.
వైయస్సార్సీపీ నాయకులు. కేసుల పర్వం:
ఇన్ని జరుగుతున్నా ప్రజల తరఫున ఏ గొంతు వినిపించకూడదని చెప్పి ఏకంగా నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన పిన్నెళ్లి రామకృష్ణారెడ్డిని జైలుకు పంపించారు. ఎంపీగా పని చేసిన దళిత నేత నందిగం సురేష్ను 190 రోజులు జైల్లో పెట్టాడు. మంత్రిగా పని చేసిన బీసీ నాయకుడు జోగి రమేష్ కుమారుడు రాజీవ్ను జైలుకు పంపించారు. వల్లభనేని వంశీని ఒక కేసు అయిన తరువాత మరో కేసు పెట్టి చిత్రహింసలు పెట్టారు.
మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కాలేజీలో కలిసి చదువుకున్నప్పుడు.. చంద్రబాబును చెప్పుతో కొట్టాడని చెప్పి, ఆయన కుమారుడు ఎంపీ మిథున్రెడ్డిని జైలుకు పంపించాడు. చిన్నప్పుడు జరిగిన ఘటను గుర్తు పెట్టుకొని ఎంత శాడిస్ట్గా వ్యవహరించాడో గమనించాలి. ఇన్ని సంవత్సరాల తరువాత ఆయన కొడుకును జైల్లో పెట్టించాడంటే ఈ మనిషిలోని విషం, రాక్షసత్వం ఎంత ఉందో చెప్పడానికి ఇదో నిదర్శనం.
మరొకరు.. చెవిరెడ్డి భాస్కర్రెడ్డి, ఈయన చేసిన తప్పు ఏంటో తెలియదు. చంద్రబాబు సొంత నియోజకవర్గం చంద్రగిరికి చెవిరెడ్డి భాస్కర్రెడ్డి ఎమ్మెల్యే కావడమే ఆయన చేసిన పాపం అన్నట్లుగా జైల్లో పెట్టించారు. 1983లో అప్పట్లో కాంగ్రెస్ పార్టీలోమంత్రిగా ఉండి పోటీ చేసి 17 వేల మెజారిటీతో ఓడిపోయారు. మళ్లీ 1989లో టీడీపీలో చేరి వాళ్ల మామ కాళ్లు పట్టుకొని కుప్పం నుంచి పోటీ చేశాడు. చంద్రగిరి తన చేతుల్లో నుంచి చేయిజారిపోయిందని భాస్కర్ను వేధించడం మొదలుపెట్టాడు. చివరకు భాస్కర్ కొడుకు మొన్ననే లండన్ నుంచి వచ్చాడు. ఆ పిల్లొడిపై కూడా కేసు పెట్టాడు.
మాజీ మంత్రులు కొడాలి నాని, పేర్ని నాని, పేర్ని నాని భార్యపై కూడా కేసు పెట్టి చిత్రహింసలే. అనిల్కుమార్ యాదవ్.. మీ జిల్లాకు పరిచయస్తుడైన వ్యక్తిని కూడా దొంగ కేసుల్లో ఇరికించాలని ప్రయత్నం చేస్తే.. ఆ కేసుల్లో దొంగ స్టేట్మెంట్లు తీసుకున్నారని, సాక్షి జడ్జి ముందు చెప్పాడంటే ఎంత దారుణంగా దొంగ కేసులు పెడుతున్నారో చెప్పడానికి ఇదో నిదర్శనం.
మరో బీసీ నాయకుడు జోగి రమేష్. మా పార్టీ సీనియర్ నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డి, ఆయన కొడుకు భార్గవ్రెడ్డిని కూడా వదలడం లేదు. వేధిస్తున్నారు. మా పార్టీ మరో సీనియర్ నాయకుడు వైవీ సుబ్బారెడ్డి, ఆయన కొడుకు విక్రాంత్రెడ్డిని కూడా వదలడం లేదు. దేవినేని అవినాష్, తలశీల రఘురాం, అంబటి రాంబాబు, అంబటి మురళి, విడదల రజని, దళిత ఎమ్మెల్యే చంద్రశేఖర్, మరో ఎమ్మెల్యే శివప్రసాద్రెడ్డి, ఉషశ్రీచరణ్, తోపుదుర్తి ప్రకాశ్రెడ్డి, దాడిశెట్టి రాజా, అబ్బయ్య చౌదరి, గోరంట్ల మాధవ్, సుధీర్, లేళ్ల అప్పిరెడ్డి, గోపిరెడ్డి శ్రీనివాస్రెడ్డి, ఉప్పాల రాము, మొండితోక అరుణ్, ఇలా నాయకులందరిపై తప్పుడు కేసులు. ప్రతాప్ అన్న పై కూడా తప్పుడు కేసులు పెట్టారు.
ఇవి కాకుండా మా పార్టీ నాయకులు, కార్యకర్తలు తమకు జరుగుతున్న అన్యాయాలను ప్రశ్నిస్తున్నా, సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్నా కూడా ఎవరినీ వదలకుండా వేల కేసులు పెట్టి వేధిస్తున్నారు.
మీ విత్తనమే రేపు వృక్షం అవుతుంది:
అయ్యా చంద్రబాబు నీవు ఒక తప్పుడు సంప్రదాయానికి విత్తనం విత్తుతున్నావు. ఇదే విత్తనం రేపు పొద్దున వృక్షం అవుతుంది. నీవు ఏదైతే విత్తుతావో అదే పండుతుంది. ఎల్లకాలం నువ్వు ముఖ్యమంత్రిగా ఉండవు. మరో మూడేళ్ల తరువాత వచ్చేది మా ప్రభుత్వం. మా ప్రభుత్వం వచ్చిన తరువాత ఇదే చంద్రబాబుకు, ఆయన అడుగులకు మడుగులు ఒత్తిన తప్పుడు అధికారులకు, ఎవరైతే అన్యాయాలు చేశారో, తప్పులు చేశారో అందరి లెక్క జమ తీస్తాం. అందరినీ చట్టం ముందు నిలబెడతాం. మీరు విత్తిన విత్తనం మాదిరిగానే రేపు పొద్దున రెండింతలుగా మీకు రాబోయే రోజుల్లో జరుగుతుంది.
ఎవ్వరినీ వదలం. చట్టం ముందు నిలబెడతాం:
ఇప్పటికైనా చంద్రబాబు మేలుకో. ఇప్పటికైనా తెలుసుకో అని చెబుతున్నా.. అలాగే ఇప్పుడైనా మీ వైఖరి మార్చుకోమని కోరుతున్నా. అలా చేయకపోతే రేపు పొద్దున జరిగే పరిణామాలకు మాత్రం కచ్చితంగా బాధ్యత మీరే వహించాల్సి వస్తుందని చంద్రబాబుకు, ఆయన అడుగులకు మడుగులు ఒత్తే అధికారులందరికీ చెబుతున్నాను.
కొంత మంది అధికారులు అనుకోవచ్చు.. మేం రిటైర్ అవుతాం. లేదా వీఆర్ఎస్ తీసుకొని విదేశాలకు వెళ్తామని అనుకోవచ్చు. అలాంటి వారందరికీ చెబుతున్నా.. సప్త సముద్రాల అవతల దాక్కున్నా వదలి పెట్టం. రిటైర్ అయినా, వీఆర్ఎస్ తీసుకున్నా కూడా ప్రతి ఒక్కరినీ పిలపించి, మీరు చేసిన ప్రతి పనికి చట్టం ముందు నిలబెడతాం. తప్పు చేసిన ప్రతి ఒక్కరికీ కచ్చితంగా శిక్ష పడేలా అడుగులు పడుతాయి’ అని శ్రీ వైయస్ జగన్ హెచ్చరించారు.