Home Political news అర్జీ సమస్య పై స్పష్టతతో పరిష్కారం చూపండి ...

అర్జీ సమస్య పై స్పష్టతతో పరిష్కారం చూపండి పరిష్కారంలో పారదర్శకత, నిబంధనలు పాటించండి జిల్లా ఇన్‌చార్జ్‌ కలెక్టర్‌ డా. నిధి మీనా

3
0

 *విజయవాడ తేది:04.11.2024*

       అర్జీ సమస్య పై స్పష్టతతో పరిష్కారం చూపండి

       పరిష్కారంలో పారదర్శకత, నిబంధనలు పాటించండి

     జిల్లా ఇన్‌చార్జ్‌ కలెక్టర్‌ డా. నిధి మీనా

  

       ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా ప్రజల నుండి స్వీకరించిన అర్జీలపై పూర్తి స్పష్టతతో పరిష్కరించినప్పుడే ఆర్జీదారులు సంతృప్తి చెందడంతో పాటు ఆర్జీలు పునరావృతం అయ్యే అవకాశం ఉండదని జిల్లా ఇన్‌చార్జ్‌ కలెక్టర్‌ డా. నిధి మీనా తెలిపారు.  

         ప్రజా సమస్యల పరిష్కార వేదిక ( పబ్లిక్‌ గ్రీవెన్స్‌ రీడ్రసెల్‌ సిస్టం, పిజిఆర్‌ఎస్‌) కార్యక్రమంలో భాగంగా సోమవారం కలెక్టరేట్‌ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో జిల్లా ఇన్‌చార్జ్‌ కలెక్టర్‌ డా. నిధి మీనా అర్జీదారుల నుండి వినతులను స్వీకరించారు.

           ఈ సందర్భంగా ఇన్‌చార్జ్‌ కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రజల నుంచి స్వీకరించిన ఆర్జీలను నిశితంగా పరిశీలించి సమస్య పై స్పష్టత కలిగినప్పుడు ఆర్జీదారులు సంతృప్తి చెందేలా పరిష్కరించగలుగుతారన్నారు. ఆర్జీలను నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని పారదర్శకత, నిబంధనలను పాటిస్తూ అధికారులు ప్రత్యేక దృష్టి సారించి స్పష్టతతో కూడిన పరిష్కారం చూపాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా ప్రజల సమస్యలను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటుందన్నారు. ఆర్జీదారులు సంతృప్తి చెందేలా పారదర్శకంగా పరిష్కారం ఉండాలని, గడువుతీరిన ఆర్జీలు ఏ స్థాయిలోను పెండిరగ్‌ ఉండరాదన్నారు. సంతృప్తి కరంగా పరిష్కారం చూపితే ప్రభుత్వ ఆశయం నేరవేరుతుందనే సందేశం ప్రతి అధికారి దృష్టిలో ఉండాలన్నారు. జిల్లాస్థాయి అధికారులు క్షేత్రస్థాయి అధికారులతో సమన్వయం చేసుకొని అర్జీల పరిష్కారంపై ప్రత్యేక దృష్టిపెట్టాలన్నారు. తమ సమస్యలు పరిష్కారం అవుతాయనే నమ్మకంతో ఆర్జీదారులు వినతులను సమర్పిస్తారని, ఆయా ఆర్జీలకు సకాలంలో పరిష్కారం చూపాల్సిన భాధ్యత అధికారులపై ఉందని జిల్లా ఇన్‌చార్జ్‌ కలెక్టర్‌ నిధి మీనా అన్నారు.

 

  *ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో మొత్తం 124 అర్జీలు అందగా.. వీటిలో* 

   రెవెన్యూ- 64, పోలీస్‌- 15, యంఎయుడి`15, పంచాయతీరాజ్‌- 2, కోపరేటివ్‌ `2, హెల్త్‌`3, విభిన్న ప్రతిభావంతుల సంక్షేమం`1, ఉపాధి హామి `1, పౌర సరఫరాలు-3, మార్కెటింగ్‌`3, స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌ `2, సర్వే `1, ఎక్సౖెెజ్‌ ` 1, ఉన్నత విద్య `1, దేవాదాయ `1, ట్రజరీస్‌ `1, ఉపాధి కల్పన `1, కార్మిక శాఖ `1, స్కిల్‌ డవలప్‌మెంట్‌ `1 పరిశ్రమలు `1, బ్యాంకు సంబంధిత `1 ఏపిసిపిడిసిఎల్‌ `2, మైన్స్‌ అండ్‌ జియాలజీ `1 అర్జీలు స్వీకరించడం జరిగింది.

       కార్యక్రమంలో డిఆర్‌వో యం. లక్ష్మి నరసింహం, డిఆర్‌డిఏ పిడి కె. శ్రీనివాసరావు, డియంఅండ్‌హెచ్‌వో యం. సుహాసిని, సివిల్‌ సప్లయి డియం టి. సతీష్‌, జిల్లా ఉద్యాన శాఖ అధికారి పి. బాలాజి కుమార్‌, గ్రామ వార్డు సచివాలయ ప్రత్యేక అధికారి పి. జ్వోతి, డా. ఎన్‌టిఆర్‌ హెల్త్‌ కేర్‌ ట్రస్ట్‌ కో`ఆర్డినేటర్‌ డా. జె. సుమన్‌ వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here