విజయవాడ, సెప్టెంబర్ 26, 2025
అమ్మ ఆశీస్సులతో రాష్ట్రం అభివృద్ధి పథంలో పయనిస్తోంది
- భక్తులకు ప్రభుత్వం చేసిన ఏర్పాట్లు చాలా బాగున్నాయి
- రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి
రాష్ట్ర మహిళా శిశు సంక్షేమం, గిరిజన సంక్షేమ శాఖ మంత్రివర్యులు గుమ్మిడి సంధ్యారాణి శుక్రవారం శ్రీ మహాలక్ష్మి దేవి అలంకృత దుర్గమ్మ వారిని దర్శించుకున్నారు.
అనంతరం ఇంద్రకీలాద్రి మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ అమ్మవారిని దర్శించుకోవడం చాలా అదృష్టంగా భావిస్తున్నానని.. ప్రజలు క్షేమంగా ఉండాలని. ముఖ్యమంత్రికి రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి పథంలో పయనింపజేసేందుకు మరింత శక్తి ఇవ్వాలని కోరుకున్నట్లు మంత్రి తెలిపారు. ప్రభుత్వం ఆధ్వర్యంలో భక్తులకు చేసిన ఏర్పాట్లు చాలా బాగున్నాయని.. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తున్నాయని మంత్రి సంధ్యారాణి తెలిపారు.
![]()
