అమరావతి
వెంకటపాలెంలో ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించిన సీఎం చంద్రబాబు
అసెంబ్లీ సమావేశాల ప్రారంభం నేపథ్యంలో వెంకటపాలెంలోని ఎన్టీఆర్ విగ్రహానికి సీఎం చంద్రబాబు నివాళులర్పించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి అక్కడికి చేరుకుని విగ్రహానికి పూలమాలలు వేశారు. అనంతరం అసెంబ్లీకి బయల్దేరారు. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ప్రసంగించారు. తొలిరోజు సమావేశాలు ముగిశాక మధ్యాహ్నం 2.30 గంటలకు అసెంబ్లీలోని కమిటీ నంబర్ హాలు-1లో సీఎం చంద్రబాబు అధ్యక్షతన తెదేపా శాసనసభాపక్ష సమావేశం జరగనుంది.