అమరావతి..
రాజధానిలో మంత్రి నారాయణ సుడిగాలి పర్యటన.
సుమారు నాలుగు గంటలపాటు పలు గ్రామాల్లో పర్యటన
.
16 వ నెంబరు జాతీయ రహదారికి అనుసంధానం చేసే E 11,E13 రోడ్లు నిర్మించే ప్రాంతాలు,పశ్చిమ బైపాస్ నిర్మాణ పనులను పరిశీలించిన మంత్రి.
*వెంకట పాలెం వద్ద కృష్ణా నదిపై నిర్మాణంలో ఉన్న విజయవాడ వెస్ట్ బైపాస్ పనులను పరిశీలించిన మంత్రి నారాయణ*
*…..నారాయణ,మంత్రి….*
*రాజధాని కోసం 58 రోజుల్లో 34 వేల ఎకరాల భూమి రైతులు స్వచ్ఛందంగా ఇచ్చారు*
*గత ప్రభుత్వం రాజధాని లేకుండా మూడు ముక్కలాట ఆడింది*
*కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి నిర్మాణానికి ఉన్న ఇబ్బందులను తొలగించుకుంటూ వచ్చాం*
*ఇప్పటికే 22 వేల కోట్ల విలువైన టెండర్లకు అధారిటీ ఆమోదం తెలిపింది*
*మరో 20 వేల కోట్లకు సోమవారం జరిగే అధారిటీ సమావేశంలో ఆమోదం తీసుకుంటాం*
*217 చదరపు కి.మీ ల పరిధిలో ఈస్ట్ నుంచి వెస్ట్ కు 16 రోడ్లు,నార్త్ నుంచి సౌత్ కి18 రోడ్లు వస్తున్నాయి*
*రాబోయే 30 ఏళ్లను దృష్టిలో పెట్టుకొని రాజధాని నిర్మాణం చేస్తున్నాం*
*సీడ్ కేపిటల్ నుంచి E11,E13,E15 రోడ్లను జాతీయ రహదారికి కలపేలా డిజైన్లు సిద్ధం చేస్తున్నాం*
*ఈ రోడ్లలో ఎక్కువగా ఉన్న అటవీ భూమి తీసుకునే ప్రక్రియ చివరి దశకు వచ్చింది*
*ఎక్కువ ఇళ్లు డ్యా కాకుండా రోడ్ల డిజైన్లు చేస్తున్నాం*
*E11 రోడ్డు ఎయిమ్స్ పక్కన సర్వీసు రోడ్డులో కలుస్తుంది,.E13 రోడ్డు డీజీపీ ఆఫిస్ పక్కన కలుస్తుంది*
*రెండు రోడ్లపై గంటకు 80 నుంచి100 కిమీ వేగంతో వెళ్ళేలా డిజైన్ చేశారు*
*రోడ్ల నిర్మాణంలో ఇళ్లు కొల్పోతున్న వారు సహకరించాలి*.
*అధికారులు,ప్రజాప్రతినిధులు ఇళ్లు కోల్పోతున్న వారితో మాట్లాడతారు*
*ఎవరినీ ఇబ్బంది పెట్టకుండా రోడ్ల నిర్మాణాలు చేస్తాం*