Home Political news అభివృధ్ధి పనులకు శంకుస్థాపన

అభివృధ్ధి పనులకు శంకుస్థాపన

4
0

 అభివృధ్ధి పనులకు శంకుస్థాపన

 

51 వ డివిజన్ పరిధిలోని పీతాని అప్పలస్వామి వీధి లో రూ 5 లక్షల 50 వేలతో చేపట్టిన మెట్లు, సైడ్ డ్రెయిన్ల నిర్మాణ అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్,51 వ డివిజన్ కార్పొరేటర్ మరుపిళ్ళ రాజేష్ ఎన్డీయే కూటమి నేతలతో కలిసి బుధవారం శంకుస్థాపన చేశారు. 

కార్పొరేటర్ మరుపిళ్ళ రాజేష్ మాట్లాడుతూ ఎన్డీయే కూటమి పాలనలో పశ్చిమ లో అభివృద్ధి పరుగులు పెడుతుందన్నారు.

సుజనా చౌదరి సహకారంతో నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేసుకుంటామని తెలిపారు. 

ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు మహదేవు అప్పాజీ రావు, అత్తులూరి ఆదిలక్ష్మి పెదబాబు, ఎన్డీయే కూటమి నేతలు సారేపల్లి రాధాకృష్ణ, కుంచం దుర్గారావు విఎంసి ఇంజినీరింగ్ అధికారులు సచివాలయ సేక్రటరీలు పాల్గోన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here