అధికారులపై మంత్రి నిమ్మల ఆగ్రహం
AP: పాలకొల్లులోని వంద పడకల ప్రభుత్వాస్పత్రిని మంత్రి
నిమ్మల రామానాయుడు తనిఖీ చేశారు. కొత్తగా చేపట్టిన
భవన నిర్మాణ పనులను పరిశీలించిన ఆయన..
అధికారులపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. శ్లాబ్ నుంచి
లీకవుతున్న వర్షపునీరు, నిల్వ ఉన్న నీటిని చూసి
మండిపడ్డారు. ‘మీ ఇంటి నిర్మాణాలు ఇలాగే ఉంటాయా’
అని అధికారులను ప్రశ్నించారు. పాత ఆస్పత్రిలో
రోగులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు.