Home Political news అద్భుత౦గా, సమర్థవంతంగా దీపం-2 పథకం అమలు మంత్రి నాదెండ్ల మనొహర్

అద్భుత౦గా, సమర్థవంతంగా దీపం-2 పథకం అమలు మంత్రి నాదెండ్ల మనొహర్

4
0

 *అమరావతి*15-11-2024

అద్భుత౦గా, సమర్థవంతంగా దీపం-2 పథకం అమలు మంత్రి నాదెండ్ల మనొహర్

అర్హులైన ప్రతి కుటుంబానికి ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు

15 రోజుల్లో 35, 77, 566 మంది బుకింగ్

25,64,951 ఉచిత గ్యాస్ సిలిండర్ల డెలివరీ

141 కోట్ల 17 లక్షల 81 వేల రూపాయలు లబ్ధిదారు ఖాతాలో జమ

కావాలనే ప్రతిపక్షాలు దీపం-2 పథకంపై ప్రజల్లో అనుమానాలు కలిగే విధంగా అసత్య ప్రచారం

శుక్రవారం శాసనమండలిలో ఎమ్మెల్సీలు  వరుదు కళ్యాణి,  ఎస్.మంగమ్మలు అడిగిన ప్రశ్నకు ఆహారం, పౌరసరఫరాల మరియు వినియోగదారుల వ్యవహారాల శాఖా మంత్రి నాదెండ్ల మనోహర్ సమాధానం

ఈ ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రం తీవ్రమైన సంక్షోభం ఎదుర్కొన్నప్పటికీ సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇచ్చిన హామీ మేరకు దీపావళి కానుకగా దీపం-2-పథకం 31 అక్టోబర్ 2024 న ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు నాయుడు ఈడుపురం గ్రామం, ఇచ్చాపురం మండలం శ్రీకాకుళం జిల్లాలో దీపం పథకాన్ని ప్రారంభించారు.

ఏపీలో సూపర్ సిక్స్ హామీ నిలబెట్టుకుంటున్న కూటమి సర్కార్. రాష్ట్రంలో ఒక కోటి 55 లక్షల 22 వేల గ్యాస్ కలెక్షన్ ఉన్నాయి. ఇందులో ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు వద్ద ఉన్న గ్యాస్ కనెక్షన్ల డేటాతో… రైస్ కార్డుల డేటాబేస్ తో అనుసంధానం చేసే విధంగా చర్యలు చేపట్టడం జరిగింది.. దీని ద్వారా రాష్ట్రంలో ఉన్న ఒక కోటి 55 లక్షల మంది గ్యాస్ కార్డుదారులకు అర్హత ఉండేవిధంగా ఈ పథకం రూపొందించడం జరిగింది.

దీపం-2 పథకానికి రూ.2,684 కోట్లు మంజూరు చేసిన రాష్ట్ర ప్రభుత్వం …మొదటి విడతకు అయ్యే ఖర్చు రూ.894 కోట్ల మొత్తాన్ని పెట్రోలియం సంస్థలకు అందజేయడం జరిగింది. 

గత 15 రోజుల్లో దీపం 2 పథకం కింద ఉచిత గ్యాస్ సిల్లిండర్లును 35 77 566 మంది బుకింగ్ చేసుకున్నారు… అందులో 2564951 మందికి ఉచిత గ్యాస్ డెలివరీ చేయడం జరిగింది….ఇందుకు గాను 141 కోట్ల 17 లక్షల 81 వేల రూపాయలు లబ్ధిదారుల ఖాతాలో జమ చేయడం జరిగింది…. కావాలనే ప్రతిపక్షాలు దీపం 2 పథకంపై ప్రజల్లో అనుమానాలు కలిగే విధంగా ప్రచారం చేస్తున్నారు

దీపం -2 పధకం క్రింద అర్హులైన కుటుంబాలు వారు తమ మొదటి సిలిండర్ పొందడం కోసం అక్టోబర్ 29వ తేదీ నుంచి 31 మార్చి 2025 వరకూ బుక్ చేసుకునే అవకాశం కల్పించారు. ఉచిత సిలిండర్ కావాల్సిన వారు సాధారణ పద్ధతిలో ముందుగా సొమ్ము చెల్లించవలసి ఉంటుంది. పట్టణ ప్రాంతాల్లో బుక్ చేసిన 24 గంటల లోపు, గ్రామీణ ప్రాంతాల్లో 48 గంటల లోపు గ్యాస్ డెలివరీ ఇస్తారు.ఆ తర్వాత సిలెండర్ డెలివరీ అయిన 48 గంటల్లోపు చెల్లించిన పూర్తి సొమ్మును లబ్దిదారుల ఖాతాల్లో తిరిగి జమ చేస్తారు

ఒక సంవత్సరంలో 3 గ్యాస్ సిలిండర్లు ఇలా ఉచితంగా పంపిణీ చేస్తారు. అయితే వీటిని ఒకేసారి కాకుండా నాలుగు నెలలకు ఒకసారి బుక్ చేసుకునే అవకాశం కల్పిస్తారు.

ఈ దీపావళితో ప్రారంభమయిన పథకంతొ పాటు ప్రతి ఏడాది ఏప్రిల్ – జూలై (01), ఆగష్టు –నవంబర్ (01), డిసెంబర్ –మార్చి (01) మధ్య మూడో సిలెండర్ బుక్ చేసుకోవచ్చు.

ఉచిత గ్యాస్ సిలిండర్ పొందడానికి అర్హతలు

1)ఎల్.పి.జి.కనెక్షన్ కలిగి ఉండటం

2) రైస్ కార్డ్,

3) చెల్లుబాటు అయ్యే ఆథార్ కార్డు 

4). ఆధార్ కార్డుతో రైస్ కార్డుతో అనుసంధానం అయి ఉండాలి…

ఎటువంటి సమాచారం లోపం ఉన్న టోల్ ఫ్రీ నెం.1967 కు ఫోన్ చేసి ఫిర్యాదులను నమోదు చేసుకోవచ్చు 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here