Home Political news అత్యాధునిక హాజ్ హౌస్ నిర్మిస్తాము : ఎంపి కేశినేని శివ‌నాథ్ (చిన్ని) ముస్లిం...

అత్యాధునిక హాజ్ హౌస్ నిర్మిస్తాము : ఎంపి కేశినేని శివ‌నాథ్ (చిన్ని) ముస్లిం సోద‌రుల‌కు ఇఫ్తార్ విందు ఏర్పాటు

3
0

 21-03-2025

విజ‌య‌వాడ‌లో అత్యాధునిక హాజ్ హౌస్ నిర్మిస్తాము : ఎంపి కేశినేని శివ‌నాథ్ (చిన్ని) 

ముస్లిం సోద‌రుల‌కు ఇఫ్తార్ విందు ఏర్పాటు 

రంజాన్ మాస శుభాకాంక్ష‌లు తెలిపిన ఎంపి కేశినేని 

హాజ‌రైన ఎమ్మెల్యేలు గ‌ద్దె రామ్మెహన్, రాజ‌గోపాల్ శ్రీరామ్ (తాత‌య్య‌), తంగిరాల సౌమ్య‌, వ‌సంత కృష్ణ ప్ర‌సాద్, 

ముస్లిం మ‌త పెద్ద‌ల‌తో క‌లిసి ఎంపి కేశినేని ప్రార్థ‌న‌లు

విజ‌య‌వాడ : టిడిపి ముస్లిం స‌మాజానికి అండ‌గా వుంటుంది. ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు ఎన్నిక‌ల స‌మ‌యంలో చెప్పిన‌ట్లు ఇమామ్ , మౌజ‌మ్ ల‌కు ప‌దివేలు, ఐదువేల రూపాయ‌లు గౌర‌వ‌వేత‌నం అందిస్తున్నారు. చెప్పిన మాట మీద నిల‌బ‌డే వ్య‌క్తి సీఎం చంద్ర‌బాబు నాయుడు అని విజ‌య‌వాడ ఎంపి కేశినేని శివ‌నాథ్ అన్నారు. 

గురునాన‌క్ కాల‌నీలోని విజ‌య‌వాడ పార్ల‌మెంట్ కార్యాల‌యం ఎన్టీఆర్ భ‌వ‌న్ లో శుక్ర‌వారం ముస్లిం సోద‌రుల‌కు ఇఫ్తార్ విందు ఇచ్చారు. టిడిపి మైనార్టీ సెల్ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి మ‌హ‌మ్మ‌ద్ ఫ‌తావుల్లా ఆధ్వ‌ర్యంలో ఇఫ్తార్ విందు కార్య‌క్రమ నిర్వ‌హ‌ణ జ‌రిగింది. ముస్లిం మ‌త పెద్ద‌ల‌తో క‌లిసి ఎంపి కేశినేని శివ‌నాథ్ (చిన్ని) ప్రార్థ‌న‌లు చేశారు.అనంతరం ముస్లిం మ‌త పెద్ద‌లు, ముస్లిం సోద‌రుల‌తో క‌లిసి ఖ‌ర్జూర పండ్లు అర‌గించారు. అనంతరం విందులో పాల్గొన్న‌ ముస్లిం సొద‌రుల‌కు ఎంపి కేశినేని శివ‌నాథ్ స్వ‌యంగా వ‌డ్డ‌న చేశారు. ఇప్తార్ విందు కార్య‌క్ర‌మానికి ముఖ్యఅతిథులుగా జిల్లా అధ్య‌క్షుడు నెట్టెం ర‌ఘురామ్, ఎమ్మెల్యేలు గ‌ద్దె రామ్మోహ‌న్, తంగిరాల సౌమ్య‌, వ‌సంత‌కృష్ణ ప్ర‌సాద్, శ్రీరామ్ రాజ‌గోపాల్ (తాత‌య్య‌), మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న పాల్గొన్నారు. 

ప్రార్థ‌నలు అనంత‌రం ఎంపి కేశినేని శివ‌నాథ్ మాట్లాడుతూ ఆ అల్లా ద‌య‌వ‌ల్ల దేశం, రాష్ట్ర బాగుండాల‌న్నారు. విజ‌య‌వాడ ఆటోన‌గ‌ర్ లోని ఆటో మొబైల్ రంగంలో ముస్లిమ్స్ చాలా మంది ప‌నిచేస్తున్నారు. ముస్లిం సామాజిక వ‌ర్గం విజ‌య‌వాడ న‌గ‌ర అభివృద్దిలో వారి పాత్ర చాలా ఉందని పేర్కొన్నారు. చిన్న‌త‌నం నుంచి ముస్లిం సోద‌రుల‌తో క‌లిసి తిరిగాను…వారికి ఆత్మీయుడిగా వుంటానని తెలిపారు. ఏ స‌మస్య వున్నా సీఎం చంద్ర‌బాబు దృష్టికి తీసుకువెళ్లి ఏ ఇబ్బంది లేకుండా అండ‌గా వుంటాన‌న్నారు. హైద‌రాబాద్ లో చంద్ర‌బాబు ముఖ్య‌మంత్రిగా వున్న స‌మ‌యంలోనే హాజ్ హౌస్ నిర్మాణం జ‌రిగింద‌ని, అంత‌కంటే అత్యాధునికంగా హాజ్ హౌస్ ను నిర్మించేందుకు కృషి చేస్తామ‌ని తెలిపారు. అలాగే ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గం ఉర్దూ కాలేజీ టిడిపి ప్ర‌భుత్వంలోనే ఏర్పాటు చేయ‌టం జ‌రిగింద‌ని గుర్తు చేశారు. సీఎం చంద్ర‌బాబు కు అన్ని కులాలు, మ‌తాల‌పై ఒకే విధ‌మైన ప్రేమ వుంటుంద‌న్నారు. ముస్లిమ్ స‌మాజం ఎంత స్వ‌చ్చంగా నీతినియ‌మాల‌తో వుంటారో అదే విధంగా తాము వుంటామ‌ని చెప్పారు. ముస్లిం సోద‌ర‌ల‌కు రంజాన్ మాస శుభాకాంక్ష‌లు తెలిపారు. 

ఈ కార్య‌క్ర‌మంలో టిడిపి రాష్ట్ర అధికార ప్ర‌తినిధి నాగుల్ మీరా, రాష్ట్ర కార్య‌నిర్వ‌హ‌క కార్య‌ద‌ర్శి ఎమ్.ఎస్.బేగ్, ఎన్టీఆర్ జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షుడు క‌రీముల్లా, టిడిపి రాష్ట్ర నాయ‌కులు జంపాల సీతారామ‌య్య‌,గ‌న్నే ప్ర‌సాద్, మాదిగాని గురునాథం, విజ‌య‌వాడ‌ అర్బ‌న్ మాజీ మైనార్టీ సెల్ అధ్య‌క్షుడు ఇర్ఫాన్, ఫిరోజ్ ల‌తో పాటు త‌దిత‌రులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here