అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ* విజయవాడ శాఖ ఆధ్వర్యంలో ఇవాళ ఎబివిపి 76వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నగరంలో
జెండా ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ పూర్వ జాతీయ నాయకులు పోతుగుంట రమేష్ నాయుడు ముఖ్య అతిథిగా పాల్గొనడం జరిగింది అనంతరం పి.బి.సిద్ధార్థ కళాశాల నుండి బందర్ రోడ్డు ఫుడ్ కోర్ట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించడం జరిగింది శిఖామణి సెంటర్లో ఉన్నటువంటి స్వాతంత్ర సమరయోధులు బాబు జగజీవన్ రావు విగ్రహానికి పూలమాల వేసి అర్పించడం జరిగింది* ఈ ర్యాలీలో వందలాదిమంది విద్యార్థులు పాల్గొని ర్యాలీని విజయవంతం చేశారు ఈ కార్యక్రమంలో *రాష్ర్ట సంయుక్త కార్యదర్శి యాగంటి వెంకట గోపి* పాల్గొన్నారు ఈ సందర్భంగా వెంకట గోపి మాట్లాడుతూ *జ్ఞానం శీలం ఏకత* అనే మూడు ప్రత్యేకతలతో ప్రారంభమైన విద్యార్థి సంఘం జాతీయ భావమే శ్రేయస్సుగా విద్యార్థుల్లో నిత్యం దేశభక్తి భావం పెంచుతూ విద్యార్థులందరినీ దేశం వైపు నడిపిస్తూ గత 76 సంవత్సరాల నుంచి భారత దేశంలో అత్యున్నత విద్యార్థి సంఘంగా ఎదిగింది ఈరోజు ప్రపంచంలోనే అతిపెద్ద విద్యార్థు సంఘం గా ఎబివిపి అని చెప్పడానికి ఏబీవీపీ కార్యకర్తగా గర్వంగా ఉందన్నారు అంతేకాకుండా స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా దేశంలో ఉన్నటువంటి విదేశీ భావాలకి ఎదురు పోరాడుతూ ప్రాణాలు సైతం లెక్కచేయకుండా వందలాది మంది ప్రాణాలు త్యాగం చేసినటువంటి ఏకైక విద్యార్ధి సంస్థ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ అని అన్నారు. దేశవ్యాప్తంగా 55 లక్షలకు పైగా సభ్యులు ఉన్నటువంటి ఏకైక విద్యార్థి సంఘం ఏబీవీపీ. అంతే కాకుండా ఏబీవీపీ తీసుకున్నటువంటి ఆర్టికల్ 370 రద్దు కోసం మొదటి రోజు నుంచి కూడా నిలబడి దాన్ని సాధించిందని ఓటర్ యొక్క వయస్సు 21 నుంచి 18 కి రావడం ఏబీవీపి విజయం అన్నారు. గత 76 సంవత్సరాల నుంచి ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని ఎమర్జెన్సీలో సైతం పని చేసినటువంటి ఏకైక విద్యార్థి సంస్థ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ మాత్రమే అని అనడానికి అతిశయోక్తి కాదని ఆయన అన్నారు. ఏబీవీపీ పూర్వ రాష్ట్ర అధ్యక్షులు పి. వి. రాము మాట్లాడుతూ విద్యార్ధి ఉద్యమాల తో పాటుగా సేవా గుణం నింపినటువంటి ఏబీవీపీ ఈరోజు జాతీయస్థాయిలో ఎంతో మంది నాయకులు ఈ దేశానికి అందించింది అని అన్నారు. దేశానికి ఉపరాష్ట్రపతి అందించింది ఏబీవీపీ అని కొనియాడారు . ఈ కార్యక్రమంలో జోనల్ ఆర్గనైజింగ్ సెక్రటరీ తిరిగే శివకుమార్ SFD రాష్ట్ర కన్వీనర్ M.సుబ్రహ్మణ్యం నగర కార్యదర్శి దుర్గారావు, అఖిల్, జితేంద్ర, బాలకాసి, రాజేష్, వసీం, హర్ష ,వరుణ్, తరుణ్, మురళి తదితరులు , విద్యార్ధులు పాల్గొన్నారు.